Sunstroke : వేసవిలో మనం ఎక్కువగా వింటున్న పేరు వడదెబ్బ. సమ్మర్లో ఉష్ణోగ్రతలు పెరిగే కొద్దీ వడదెబ్బ కేసులు పెరుగుతుంటాయి. ఎండ వేడిమికి శరీరంలో ద్రవాలు తగ్గి డీహైడ్రేషన్ ముప్పు కూడా ఎక్కువే. ఇది చివరికి వడదెబ్బకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో అవయవాలు పనిచేయకపోవడం, మరణం కూడా సంభవించవచ్చు. ఈ సమ్మర్లో వడదెబ్బ మరణాల సంఖ్య క్రమంగా పెరగడం మనం చూస్తూనే ఉన్నాం.తీవ్రమైన ఎండల్లో తిరిగినప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి వేడిగా అనిపించే పరిస్థితిని వడదెబ్బ అంటారు. ఈ సందర్భంలో చెమట గ్రంధులు పనిచేయడం మానేస్తాయి. అంటే వడదెబ్బ తగిలితే శరీరం చెమట పట్టదు. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత నియంత్రణలోకి రాదు.
వడదెబ్బలకి పలువురు మృత్యువాత పడుతుండడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనాలు బయటకి రావాలంటే గజగజ వణికిపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలలో ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో జనాలు పిట్టలలా ఎగిరిపోతున్నారు. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్క రోజే సుమారు ఐదుగురు కన్ను మూశారు. ఏప్రిల్ 29న నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అలానే సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరింత ఎండలు పెరిగిపోవడంతో ఐదుగురు కన్నుమూసారు.
ములుగు జిల్లా బూటారం గ్రామానికి చెందిన రామగిరి ప్రేమలీల(70), కుమురం భీం జిల్లా ఎల్కపల్లి గ్రామానికిచెందిన చౌధరి రవి(23), కాగజ్నగర్ రైల్వేస్టేషన్లోని రెండో ప్లాట్ఫాంపై గుర్తుతెలియని వృద్ధుడు, శంషాబాద్లో భిక్షాటన చేస్తూ జీవించే 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి వడదెబ్బతో కన్నుమూసారు.అలానే నల్గొండ జిల్లా అజ్మాపురానికి చెందిన కౌషిక్(12) అనే బాలుడు కూడా వడదెబ్బతో కానరాని లోకాలకి వెళ్లారు. ఇప్పుడు వడదెబ్బతో కొందరు ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతున్నారు. ఇక తెలంగాణలో రానున్న నాలుగు రోజులలో ఎండలు బాగా పెరిగే అవకాశం ఉంది. మే, 3 వరకు ఎండలు కొనసాగుతాయని అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది వాతావరణ శాఖ
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.