Ktr : ఇటీవల ఏపీ, తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతుంది. ఎక్కడ చూసిన మధ్యలోకి బీజేపీని లాగుతుండడం హాట్ టాపిక్ అవుతుంది. రీసెంట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరతానని ప్రధానమంత్రి మోదీకి మాట ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టి సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ప్రధాని మోదీని పల్లెత్తు మాట అనడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని, అసెంబ్లీలోనూ తాను ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు చెప్పారు. రేవంత్ రెడ్డి తదుపరి రాజకీయ మజిలీ బీజేపీయేనని, ఆ పార్టీలో చేరడం ఖాయమని పేర్కొన్నారు.
తన రాజకీయ అరంగేట్రం ఏబీవీపీలో ప్రారంభం అయిందని, బీజేపీ జెండా కప్పుకొని చనిపోతానని ప్రధానితో రేవంత్ చెప్పినట్లు తెలిసిందని కేటీఆర్ అన్నారు. ప్రధానమంత్రితో ఈ విషయం చెప్పింది వాస్తవమా కాదా రేవంత్ రెడ్డి వివరణ ఇవ్వాలని అన్నారు. అదానీ అంశంలో కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపు ఇచ్చిందని, అందులోనూ రేవంత్ రెడ్డి పాల్గొంటారా లేదా చెప్పాలని కేటీఆర్ అడిగారు. దేశంలో అదానీకి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మాత్రమేనని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి చేసిన 8,888 కోట్ల రూపాయల అమృత్ టెండర్ల కుంభకోణం గురించి సాక్ష్యాలతో సహా బయటపెట్టారు.సీఎం బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హతలు లేకున్నా రూ.వేల కోట్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని తెలిపారు. ఇండియన్ హ్యూమ్ పైప్ అనే సంస్థను అడ్డం పెట్టుకొని అక్రమాలకు తెరతీశారన్నారు. ఈ అక్రమాలపై సీఎం రేవంత్ విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలకు తెరతీసిన ఎందరో తమ పదవులను కోల్పోయారని, అదే పరిస్థితి రేవంత్ ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎలా స్పందించాలో తెలియడం లేదు.సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి సతీమణి తమ్ముడు అయితే సాక్ష్యాలతో నిరూపించాలి. కాని రేవంత్ బావమరిదికి ఇచ్చారు అనే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు, కాని ఎలా అనేది మాత్రం చెప్పడం లేదు.ఆధారాలతో బయటపెడితే కేంద్రం డైరెక్ట్గా చర్యలు తీసుకుంటుంది కదా అని కొందరు అంటున్న మాట. మరి రానున్న రోజులలో ఈ మేటర్ ఎక్కడి వరకు వెళుతుందా అని అందరు ముచ్చటించుకుంటున్నారు.
Credit Card : ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువగా పెరుగుతూ పోతుంది. చిన్న ఎంప్లాయిస్ నుండి పెద్ద…
Tirupati Laddu : తిరుమల శ్రీవారి లడ్డూల్లో జంతుకొవ్వు, చేపనూనె వాడకం జరిగిందనే వివాదం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. జగన్…
Janasena : సార్వత్రిక ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న జనసేన పార్టీకి కొత్త జోష్ వస్తోంది.…
Devara Trailer Review : ఎన్ టీ ఆర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర మరో ఐదు రోజుల్లో…
Nagarjuna : బిగ్ బాస్ సీజన్ 8 రోజురోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ వయోలెంట్గా మారుతుండడంతో షో మంచి మజా…
Brinjal : మనం ప్రతిరోజు ఎన్నో రకాల కూరగాయలను తింటూ ఉంటాం. వీటిల్లో ఒకటి వంకాయ. అయితే వంకాయ అంటే చాలామందికి…
Jobs in LIC : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) లో…
Walking : మనం ప్రతిరోజు కొద్దిసేపు చెప్పులు లేకుండా నడవడం వలన అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంటే చెప్పులు…
This website uses cookies.