
Tirupati Laddu : లడ్డూ ఇష్యూలో జగన్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్న పవన్, చంద్రబాబు
Tirupati Laddu : తిరుమల శ్రీవారి లడ్డూల్లో జంతుకొవ్వు, చేపనూనె వాడకం జరిగిందనే వివాదం దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది. జగన్ సారథ్యపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ వ్యవహారం జరిగిందని సిఎం చంద్రబాబు నాయుడు ల్యాబ్ టెస్టుల నిర్థారణలతో వెల్లడించారు. దీనితో దేశంలో పలు చోట్ల నిరసనలు చెలరేగాయి. ఈ విషయంపై త్వరలోనే సిబిఐ దర్యాప్తునకు కేంద్రం ఆదేశిస్తుందని వార్తలు వెలువడుతున్నాయి. మాజీ సిఎం వైఎస్ జగన్కు వ్యతిరేకంగా భోపాల్లో హిందూ మత సంస్థలు నిరసన ప్రదర్శనలకు దిగాయి.పలువురు కేంద్ర మంత్రులు ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ మాట్లాడుతూ ఈ విషయంలో దొంగలు ఎవరైనా వదిలేది లేదన్నారు.
వారిని ఉరితీయాల్సిందే అన్నారు. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే వారు జైలు పాలు కావల్సిందే అన్నారు. కాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ ఈ విషయంపై సిబిఐ దర్యాప్తు అత్యవసరం అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూపై స్పందిస్తూ..హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఫైర్ అయ్యారు. దేవుడా క్షమించు.. అంటూ కోరుతూ ఈ రోజు పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా సంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆయన స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి.. 11 రోజుల పాటు ఈ దీక్ష స్వీకరించారు. అనంతరం తిరుమల తిరుపతి దేవుడిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను ప్రస్తావించారు. వైసీపీ హయాంలో రథాలను సైతం తగలబెట్టారని ఆలయాలను అపవిత్రం చేశారని భగ్గుమన్నారు. రాముడి విగ్రహంలో తల తొలగిస్తే కూడా పోరాడినట్లు చెప్పారు. అయితే.. తమకు ఏ మతము అయినా ఒకటేనని.. ఎవరికి అన్యాయం జరిగినా పోరాడుతామని చెప్పుకొచ్చారు.
Tirupati Laddu : లడ్డూ ఇష్యూలో జగన్పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్న పవన్, చంద్రబాబు
తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం అయిందని భావించిన చంద్రబాబునాయుడు ఇప్పటికే ఆలయాన్ని సంప్రోక్షణ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయం మొత్తం శుద్ధి చేయాలని ఆదేశించారు. ఇంతటి సున్నితమైన అంశాన్ని లోతుగా విచారణ చేస్తున్నామని వెల్లడించారు. మార్కెట్లో 600 కిలో అమ్ముడవుతున్న నెయ్యి.. తిరుమలకు కేవలం రూ.320లకే ఎలా ఇవ్వగలిగారని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్తో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశారని మాజీ ముఖ్యమంత్రి జగన్పై మండిపడ్డారు. అందుకే రాష్ట్రంలోని దేవాలయాలన్నింటిలోనూ తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు
Telangana Farmers : తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక శుభవార్త…
Gas Cylinder Offer: వ్యాపారం అన్నాక లాభనష్టాలు సహజం. కానీ ఆ వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన ముడిసరుకులే దొరకకపోతే ఆ…
Ys Sharmila And YS Jagan : రాజకీయాల్లో కాలం ఎప్పుడు ఎవరికి కలిసి వస్తుందో చెప్పలేం. ఇప్పుడు ఏపీ…
Pakistan And India Issue: భారత్ పాకిస్థాన్ మధ్య ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే యుద్ధ మేఘాలు కమ్ముకున్నట్టు కనిపిస్తున్నాయి. భారత్…
Raghav Chadha : జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీలో Aam Aadmi Party ఇప్పుడు సంచలన పరిణామాలు…
Indiramma Indlu Phase 2 తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేదలకు, సొంతిల్లు లేని వారికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం…
Chandrababu and KCR : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందడం ఇప్పుడు…
Paytm Gas Cylinder Offer : సామాన్యుడి జేబుకు ప్రతి నెలా చిల్లులు పడుతున్న రోజులివి. పెరుగుతున్న నిత్యావసర సరుకుల…
Gold Silver Rate 3rd April 2026 పసిడి ప్రియులకు, ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్…
Carmeni Selvam Movie Review : బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం పాత్వే ప్రొడక్షన్స్ బ్యానర్పై అరుణ్…
sharwanand Biker Movie Review : వరుస విజయాలు, విభిన్నమైన కథలతో తెలుగు ప్రేక్షకులను అలరించే టాలెంటెడ్ హీరో శర్వానంద్.…
Amaravati Farmers : పార్లమెంటు ఎగువ సభ అయిన రాజ్యసభలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు…
This website uses cookies.