KTR : నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు.. అవినీతి బయటపడింది : కేటీఆర్
ప్రధానాంశాలు:
KTR : నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు.. అవినీతి బయటపడింది : కేటీఆర్
KTR : నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి Revanth reddy పేరు పెట్టడంతో.. సీఎం అవినీతి బండారం బయటపడిందని కేటీఆర్ KTR అన్నారు. వందల కోట్లతో మొదలైన రేవంత్ అవినీతి బాగోతం గత ఏడాదిన్నరలో సీఎం పదవిని అడ్డం పెట్టుకుని ఏకంగా వేల కోట్లకు చేరింది. దివ్యమైన తెలంగాణని దివాళా తీసి వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీ కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారని కేటీఆర్ అన్నారు.

KTR : నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు.. అవినీతి బయటపడింది : కేటీఆర్
KTR కేటీఆర్ కామెంట్స్..
ఇప్పుడు రేవంత్ రెడ్డి – పొంగులేటి తరహాలో చీకట్లో బీజేపీ పెద్దల కాళ్లు పట్టుకుంటాడా..? ఈడీ, కేవలం చార్జిషీటులో పేరు పెట్టడం వరకే పరిమితం అవుతుందా..? లేక రేవంత్ రెడ్డిని విచారణను పిలిచి మొత్తం అవినీతి కుంభకోణాలను కక్కిస్తుందా..? రాష్ట్ర కాంగ్రెస్లో రోజురోజుకూ పేట్రేగిపోతున్న అంతర్గత లాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది. పెరిగిపోతున్న తిరుగుబాట్లతో సీఎం కుర్చీ ఎప్పుడూ కూలిపోతుందో అనే భయం రేవంత్ రెడ్డిని అడుగడుగునా వెంటాడుతోంది. ఏం చేయాలో తెలియకఅటెన్షన్ డైవర్షన్ కోసం రోజురోజుకూ చేస్తున్న చిల్లర చేష్టలు, కొత్త కుట్రలకు తెరపడినట్టే అని కేటీఆర్ పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి పిల్లనిచ్చిన మామ సూదిని పద్మారెడ్డియే స్వయంగా కాళేశ్వరంలో అవినీతి జరగలేదనడంతో ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయినై.. కమీషన్లు లేనిదే ప్రభుత్వంలో ఒక్కటంటే ఒక్క ఫైలు కదలడం లేదని స్వయంగా కేబినెట్ మంత్రి కొండా సురేఖ కుండబద్దలు కొట్టడంతో కాంగ్రెస్ నిర్వాకాలన్నీ వరుసగా వెలుగుచూస్తున్నాయి. వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీచేస్తూ, పేదల జీవితాలతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి పాపం పండింది. చివరికి ధర్మం గెలుస్తుంది అని కేటీఆర్ అన్నారు. చివరకు జై తెలంగాణ.. జై కేసీఆర్.. అని కేటీఆర్ నినదించారు.