
telangana parties
Nagarjuna Sagar by elections : తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి ముగిసింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల హడావుడి ముగిసింది. ఆ ఎన్నికలు ముగిశాయో లేదో అసెంబ్లీ మరియు పార్లమెంటు స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ ఎన్నికపై మొత్తం రాష్ట్ర యంత్రాంగం మొత్తం దృష్టి పెట్టింది. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అధికార టీఆర్ఎస్ పార్టీ విపక్ష బీజేపీ మరియు కాంగ్రెస్లు కూడా నాగార్జున సాగర్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ మూడు పార్టీలకు కూడా ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ఇప్పుడు మనం చూద్దాం.
మొదటగా అధికార టీఆర్ఎస్ పార్టీకి బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా దుబ్బాక ఉప ఎన్నిక మరియు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో షాక్ మీద షాక్ తగిలింది. దాంతో రాష్ట్రంలో ప్రజలు టీఆర్ఎస్ హవా తగ్గింది అనే భావనకు వస్తున్నారు. బీజేపీ ఆ భావనను బలంగా కల్పించేందుకు గాను ప్రచారం చేస్తుంది. నాగార్జున సాగర్ లో కూడా టీఆర్ఎస్ ఓడిపోతే ఖచ్చితంగా సీఎం కేసీఆర్ హవా తగ్గినట్లుగా మరింతగా ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. అందుకే సీఎం కేసీఆర్ ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ అధికారంలోకి రావడం సాధ్యం కాకపోవచ్చు అంటూ ప్రజల్లో భావన కలిగితే 2023 ఎన్నికల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ ఇతర టీఆర్ఎస్ ముఖ్య నాయకులు సాగర్ పై గెలుపు కోసం కృషి చేస్తున్నారు.
telangana parties
సాగర్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధించి ఇప్పటి వరకు తాము సాధించిన విజయాలు గాలి వాటం కాదు అని నిరూపించుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. టీఆర్ఎస్ కు మేమే ప్రత్యామ్నాయం అంటూ బీజేపీ బలంగా ప్రచారం చేసుకుంటుంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీ బలం బాగా పెరిగినట్లుగా అనిపిస్తుంది. రాష్ట్రంలో బీజేపీ బలం మరింతగా పెరిగి 2023 ఎన్నికల్లో సత్తా చాటాలంటే సాగర్ లో గెలవాలి. ఇక కాంగ్రెస్ ఇప్పుడు చాలా కష్టాల్లో ఉంది. ఇప్పటికే మూడువ స్థానంకు కాంగ్రెస్ పడిపోయినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీఎం కేసీఆర్ తీవ్రంగా కాంగ్రెస్ ను నష్టపర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ కు దెబ్బ కొట్టేలా సాగర్ లో గెలవాలని కాంగ్రెస్ భావిస్తుంది. జానా రెడ్డిని ఎంపిక చేసిన కాంగ్రెస్ ఆయన గెలిస్తే ఊపిరి పోసుకున్నట్లుగా అవుతుంది. మరి జానా రెడ్డి కాంగ్రెస్ కు ఉపిరి పోస్తాడా లేదంటే బీజేపీకి సాగర్ జనాలు మరింత బలం ఇస్తారా అదీ కాకుంటే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంకు మద్దతుగా సాగర్ జనాలు నిలుస్తారా అనేది మే 2న కౌంటింగ్ తో క్లారిటీ వచ్చేస్తుంది.
Crystal Shivling : హిందూ సంప్రదాయంలో శివలింగానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పరమశివుడి నిరాకార స్వరూపానికి ప్రతీకగా భావించే…
Tea : భారతీయుల జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక కప్పు వేడి వేడి…
Chiranjeevi Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా విడుదలైన మొదటి…
Best Smartphones : స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రతి నెలా కొత్త మోడళ్లు విడుదలవుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఎన్నో ఎంపికలు అందుబాటులోకి…
Mango Farmer : మామిడి పండ్లను పండించే రైతులు మంచి దిగుబడి వస్తే సంతోషిస్తారు. కానీ ఒడిశాకు చెందిన ఓ…
Summer Holidays : రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో…
Peddi Movie Day 1 Collections : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా…
Peddi Movie OTT : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana తెరకెక్కించిన…
CM Revanth Reddy : ఉప్పల్ Uppal ప్రాంత ప్రజలకు మరో శుభవార్త అందింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (MMC)…
Farmers : వ్యవసాయ రంగంలో రైతులకు తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత కీలక పథకాలలో…
Chandrababu Pawan Kalyan : తెలంగాణ Telangana రాజకీయాల్లో తాజాగా కొత్త చర్చకు తెరలేచింది. Andhra pradesh ఆంధ్రప్రదేశ్ ఉప…
Parameshwar Reddy : ఉప్పల్ Uppal ప్రాంతంలోని నాలా అభివృద్ధి పనుల నేపథ్యంలో పలువురు కాలనీవాసులు ఆందోళనకు గురవుతున్న వేళ,…
This website uses cookies.