Categories: andhra pradeshNews

Ys Jagan : టీడీపీ నుండి వచ్చిన ఆ ఎమ్మెల్యేపై జగన్ కు పీకల్లోతు కోపం ఉందట

తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు వైకాపా నుండి వలసలను అధికంగా ప్రోత్సహించారనే విషయం తెల్సిందే. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వైకాపాను వీడి తెలుగు దేశం పార్టీని చేరారు. ఇప్పుడు వైకాపా అధికారంలో ఉంది. సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి చిన్న సైగ చేస్తే చాలు తెలుగు దేశం పార్టీ నుండి చంద్రబాబు నాయుడు గుడ్ బై చెప్పి వైకాపాలో జాయిన్‌ అయ్యేందుకు చాలా మంది సిద్దంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకు సగం మంది ఎమ్మెల్యేలు హ్యాండ్‌ ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి సమయంలో వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఎక్కువగా వలసలను ప్రోత్సహించడం లేదు. బేషరతుగా వచ్చిన వారికి మాత్రమే వైకాపాలో ఛాన్స్ ఉంటుంది.

తెలుగు దేశం పార్టీ నుండి బేషరతుగా వచ్చిన ఎమ్మెల్యేల్లో విశాఖ దక్షిణం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్‌ ఒకరు. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో తెలుగు దేశం ను వీడి వైకాపాలో జాయిన్ అయిన ఈయన ఇటీవల జీవీఎంసీ ఎన్నికల్లో వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు తెర తీసింది. ఆయన నియోజక వర్గం పరిధిలో మొత్తం 13 డివిజన్లు ఉంటే అందులో కేవలం 5 డివిజన్లను మాత్రమే వైకాపా గెలుచుకుంది. ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ వ్యవహరించిన తీరే మిగిలిన చోట్ల ఓటమికి కారణం అంటున్నారు. గెలిచిన వారు కూడా వాసుపల్లి పేరుతో గెలిచిన వారు కాదు. వారికి సొంత ఇమేజ్ ఉన్న వారే అంటున్నారు. ఈ విషయమై సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చాలా సీరియస్ గా ఉన్నారు.

ap cm ys jagan

అభ్యర్థుల ఎంపిక నుండి మొదలుకుని ఎన్నికల రోజు వరకు ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై విశాఖ ఇంచార్జ్‌ విజయ సాయి రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడట. విజయ సాయి రెడ్డితో ఇప్పటికే సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్నారు. జీవీఎంసీలో మెజార్టీ భారీగా వచ్చే అవకాశం కేవలం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌ కుమార్ వల్లే మిస్ అయ్యిందని సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి భావిస్తున్నాడట. చాలా నమ్మకం పెట్టుకుని బాధ్యతలు అప్పగిస్తే ఆయన తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారేమో అనే అనుమానాలను కొందరు పార్టీ నాయకులు సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి వద్ద వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఆయనపై వైకాపా అధినేత సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.

Recent Posts

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?

Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…

23 minutes ago

Gupt Navratri 2025 : ఆషాడ మాసంలో గుప్త నవరాత్రులలో అమ్మవారిని ఎలా పూజించాలి.. కోరిన కోరికలకు.. ఏ దేవతలు వరమిస్తారు…?

Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…

1 hour ago

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

10 hours ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

11 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

12 hours ago

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…

13 hours ago

YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్‌

YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…

14 hours ago

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

15 hours ago