Home » News » Nagarjuna Sagar Gates Lifted After 18 Years
News

Nagarjuna Sagar : జులై నెలలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. 18 ఏళ్ల తర్వాత జరిగింది.. వీడియో !

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: July 29, 2025, 5:00 pm
Advertisement

Nagarjuna Sagar : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ భారీ వరద నీటితో నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నది ప్రవాహం తీవ్రంగా పెరిగింది. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో శ్రీశైలం జలాశయానికి 2,31,612 క్యూసెక్కుల వరద వచ్చిన వేళ, అధికారులు ఐదు గేట్లను ఒక్కొక్కటి 10 అడుగుల మేర పైకెత్తి, 2,01,229 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేశారు. ప్రస్తుత నీటిమట్టం 882.8 అడుగులు, నీటి నిల్వ 203.4290 టీఎంసీలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ఇదే విధంగా నాగార్జునసాగర్ జలాశయంలో కూడా నీటి మట్టం గణనీయంగా పెరిగింది.

Advertisement

Nagarjuna Sagar : జులై నెలలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత.. 18 ఏళ్ల తర్వాత జరిగింది.. వీడియో !

Nagarjuna Sagar  : 18 ఏళ్ల తర్వాత జులై నెలలో నాగార్జున సాగర్ గేట్లు ఎత్తివేత..!

గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతానికి ఇది 584.41 అడుగులుకి చేరుకుంది. అలాగే గరిష్ట నిల్వ సామర్థ్యం 312.05 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 295.7 టీఎంసీలుగా నమోదైంది. వరద తీవ్రత నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంగళవారం ఉదయం సాగర్ గేట్లను పైకి ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేశారు. గత 18 ఏళ్లలో ఇదే తొలిసారి నెలరోజుల ముందుగానే ఈ స్థాయికి నీటి నిల్వ చేరడం గమనార్హం. అప్పుడెప్పుడో 18 ఏళ్ల క్రితం జులై నెలలో గేట్లు ఎత్తగా..మళ్లీ ఇప్పుడు గేట్లు ఎత్తడం విశేషం.ప్రస్తుతం సాగర్ జలాశయం ద్వారా విద్యుదుత్పత్తి క్రమంలో 28,785 క్యూసెక్కుల నీరు తెలంగాణకు విడుదలవుతుండగా, కుడి ప్రధాన కాల్వ ద్వారా 5,394 క్యూసెక్కుల నీటిని ఆంధ్రప్రదేశ్ తీసుకుంటోంది. అలాగే ఎడమ ప్రధాన కాల్వ ద్వారా రెండు రాష్ట్రాల అవసరాలను తీర్చేందుకు మరో 6,634 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

Advertisement

ఈ పరిస్థితిలో రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తే అవకాశం లేకుండా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌ కలిసి సాగర్ నుంచి నీటిని అధికారికంగా విడుదల చేశారు. గేట్లు ఎత్తే ముందు కృష్ణమ్మకు పూజలు నిర్వహించి నీటిని వదిలారు. జూరాల, శ్రీశైలం నుంచి భారీగా వచ్చే వరదనీరు క్రస్ట్‌గేట్ల ద్వారా దిగువకు తరలించబడుతోంది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని అధికారులు సూచించారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి