Ponnam Prabhakar : తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తీవ్ర మనస్తాపానికి గరైన జీవన్ రెడ్డి రాజీనామా చేస్తారనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే వెంటనే డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి దుద్దళ్లి శ్రీధర్ బాబు లు జీవన్ ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు.. దీంతో ఆయన చల్ల బడ్డారు.. ఈ నేపథ్యంలోనే తాజాగా జీవన్ రెడ్డి ఎపిసోడ్ ఢిల్లీకి చేరుకుంది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ జీవన్ రెడ్డికి ప్రత్యేకంగా ఫోన్ చేసి మాట్లాడారు.
వెంటనే ఆయనని ఢిల్లీకి రావాలని ఆదేశించారు. దీంతో ఢిల్లీలో ఉన్న దీపాదాస్ మున్షీని కలిసేందుకు జీవన్ రెడ్డి ఢిల్లీకి బయలు దేరారు..జీవన్ రెడ్డి ని ఢిల్లీకి పంపించే బాద్యతలను ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కు అప్పగిస్తూ ఏఐసీసీ ఇన్ఛార్జ్ ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని హూంకరించడంతో పాటు కాంగ్రెస్కు రాజీనామా చేస్తానని ప్రకటించడం జీవన్రెడ్డి మార్కు రాజకీయంగా చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. వరుసగా ఓడినా కాంగ్రెస్లో తన ఉనికి చాటుకుంటున్న జీవన్రెడ్డి… ప్రత్యక్ష రాజకీయాలకు దూరమంటూనే తన నియోజకవర్గ పరిణామాలను వదలకపోవడం… ఎమ్మెల్యే చేరికను వ్యతిరేకిస్తుండటం వెనుక చాలా పెద్ద స్కెచ్చే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోటాలో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్కి మంత్రి పదువులు వరించాయి. ఈ సారి జీవన్ రెడ్డి ఎన్నికలలో ఓడిపోవడంతో ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఆయన అలడంతో ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్.. జీవన్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడి మంత్రి పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. మరి కొద్ది రోజులలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉండబోతున్నట్టు తెలుస్తుంది.
జూలై 3 లేదా 4న మిగిలిన ఆరు పదవులని భర్తీ చేయడానికి రేవంత్ రెడ్డి కసరత్తులు చేస్తున్నాడట. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మూడో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే పొన్నంని తప్పించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా, రేవంత్ రెడ్డి రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ.. 2021 జూన్ 27 నాడు పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు. జులై 7న చార్జ్ తీసుకున్నాను. మూడేళ్ళతో నా పదవీకాలం ముగుస్తుంది. కొత్త పీసీసీని ఎంపిక చేయాలని అధిష్టానాన్ని కోరాను.జగిత్యాల అభివృద్ధి కోసం అక్కడి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరారని, జీవన్ రెడ్డి అనుభవాన్ని పార్టీ సమర్థవంతంగా వినియోగించుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.