YS Sharmila – Priyanka Gandhi : ఓహో.. కర్ణాటకలో గెలిచిన ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ మామూలు దూకుడు మీద లేదు. అవును.. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెసేతర పార్టీలు అధికారంలో ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయా పార్టీలను ఓడించాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ ను ఓడించేందుకు ఏకంగా ప్రియాంకా గాంధీ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది.
నిజానికి.. తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టి రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. అందుకే.. తెలంగాణ రాజకీయాల విషయంతో వైఎస్ షర్మిలతో ప్రియాంకా గాంధీ సంప్రదింపులు చేశారట. ప్రియాంక గాంధీ.. వైఎస్ షర్మిలకు ఫోన్ చేశారట. ఇద్దరూ కలిసి చాలాసేపు మాట్లాడుకున్నారట. ఏపీ, తెలంగాణలో వైఎస్ షర్మిల ద్వారా తమ ప్లాన్ ను అమలు చేయాలని ప్రియాంకా గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రియాంకా గాంధీ, షర్మిల మధ్య డీకే శివకుమార్ మధ్యవర్తిత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి.. డీకే శివకుమార్ కు, షర్మిల కుటుంబానికి చాలా సాన్నిహిత్యం ఉంది. అందుకే.. డీకే శివకుమార్ ద్వారా ప్రియాంకా గాంధీ.. షర్మిలలతో మాట్లాడారట. ఈ వ్యవహారాన్ని శివకుమారే దగ్గరుండి చూసుకుంటున్నారట. షర్మిలను కాంగ్రెస్ వైపు లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంటే.. వైఎస్సార్టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. షర్మిలకు కాంగ్రెస్ లో విలీనం చేస్తే అటు తెలంగాణ, ఇటు ఏపీ రెండు రాష్ట్రాల్లో తమకు ప్రయోజనం ఉంటుందని ప్రియాంకా గాంధీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.