Ramantapur Pedda Cheruvu : రామంతాపూర్ పెద్ద చెరువుకు మహర్దశ.. రూ.19 కోట్లతో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి : పరమేశ్వర్ రెడ్డి..!
ప్రధానాంశాలు:
Ramantapur Pedda Cheruvu : రామంతాపూర్ పెద్ద చెరువుకు మహర్దశ.. రూ.19 కోట్లతో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి : పరమేశ్వర్ రెడ్డి..!
Ramantapur Pedda Cheruvu : ఉప్పల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా రామంతాపూర్ పెద్ద చెరువు సుందరీకరణ, ముంపు సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి బుధవారం హైడ్రా అధికారులతో కలిసి రామంతాపూర్ పెద్ద చెరువును పరిశీలించి జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఉప్పల్ నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మొత్తం రూ.150 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలోని చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, అందులో భాగంగా రామంతాపూర్ పెద్ద చెరువును హైడ్రా ద్వారా రూ.19 కోట్లతో సుందరీకరిస్తున్నామని వెల్లడించారు.
Ramantapur Pedda Cheruvu : రామంతాపూర్ పెద్ద చెరువుకు మహర్దశ.. రూ.19 కోట్లతో మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి : పరమేశ్వర్ రెడ్డి..!
Ramantapur Pedda Cheruvu మినీ ట్యాంక్ బండ్గా రామంతాపూర్ చెరువు
రామంతాపూర్ పెద్ద చెరువును ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి మినీ ట్యాంక్ బండ్గా మార్చనున్నట్లు పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, అందమైన లైటింగ్, గ్రీనరీ, విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.అదే సమయంలో చెరువు చుట్టూ నివసిస్తున్న పేదలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. “ఏ ఒక్క నిర్మాణాన్ని కూడా కూల్చివేయం. గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తాం” అని పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో స్థానిక కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేశారు.
Ramantapur Pedda Cheruvu : ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం
గత బీఆర్ఎస్ పాలనలో హబ్సిగూడ, రవీంద్ర నగర్, సాయి చిత్ర నగర్, మహేశ్వరి నగర్ వంటి ప్రాంతాలు తీవ్ర ముంపుకు గురయ్యాయని పరమేశ్వర్ రెడ్డి విమర్శించారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ప్రజలు పడవలపై ప్రయాణించాల్సిన పరిస్థితి వచ్చిందని గుర్తుచేశారు. అయితే అప్పటి ప్రభుత్వం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కట్టుబడి ఉందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతం నుంచి వచ్చే వరదనీటిని సక్రమంగా తరలించేందుకు రూ.16 కోట్లతో SNDP పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, పూర్తయిన తర్వాత కాలనీలు ముంపుకు గురయ్యే పరిస్థితి ఉండదని చెప్పారు.“మాటలు కాదు.. చేతలు” అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని పరమేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, హైడ్రా అధికారులు, సీనియర్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామంతాపూర్, హబ్సిగూడ ప్రాంతాలకు చెందిన ప్రజలు చెరువు అభివృద్ధి పనులపై హర్షం వ్యక్తం చేశారు.