Rythu Bharosa : గ్రామాల వారీగా రైతు భరోసా నగదు బదిలీ.. ఎల్లుండి నుండి అకౌంట్లోకి డబ్బులు..!
Rythu Bharosa : రైతు భరోసా విషయంలో గత కొద్ది రోజులుగా అందరిలో అనేక అనుమానాలు ఉండగా, వాటిపై ఓ క్లారిటీ అయితే వచ్చింది. రైతు భరోసా పథకం నిధులు జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేయడం జరిగిందని మంత్రి తుమ్మల వెల్లడించారు. రైతు భరోసా Rythu Bharosa నిధుల విడుదల రెవెన్యూ గ్రామాల వారీగా జరుగుతుంది కనుక కొన్ని జిల్లాలలో మండలానికి ఒకటి కంటే ఎక్కువ గ్రామాల సంఖ్య కనపడుతుందని తుమ్మల స్పష్టం చేశారు.వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయభరోసా నిధుల జమకూడా కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అర్హులైన ప్రతిరైతుకు రైతుభరోసా Rythu Bharosa నిధులను జమచేస్తామని ఆయన స్పష్టం చేశారు. సాగుయోగ్యం కాని భూముల గుర్తింపు సర్వేకొనసాగుతుందని ఆయన వివరించారు.
Rythu Bharosa : గ్రామాల వారీగా రైతు భరోసా నగదు బదిలీ.. ఎల్లుండి నుండి అకౌంట్లోకి డబ్బులు..!
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా Rythu Bharosa, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రామాల్లో ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. సొంత నియోజవకర్గం కొండగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ నాలుగు పథకాలను ప్రారంచించారు. ఆ మరుసటి రోజే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఫిబ్రవరి 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఎకరాకు పంట పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ. 12 వేలు ఇవ్వనుండగా.. తొలి విడత సొమ్ము కింద ఎకరాకు రూ.6 వేలు జమ చేయనున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులని 600 గ్రామాలలోనే కాకుండా అంతకు రెట్టింపు గ్రామాలలో చేసే అవకాశం ఉంది. ముందు గ్రామాలలోనే ఈ రెండు స్కీమ్స్ అమలు చేయాలని ప్రభుత్వం యోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.