Telangana Congress : తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక ఉన్న వ్యూహకర్త ఎవరో..?
Telangana Congress : ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో సునీల్ కొనుగోలు పేరు బాగా వినిపిస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక ఆయన వ్యూహాలు చక్కగా పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి సహా తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడటంతో పాటు సునీల్ వ్యూహాలు కూడా కలిసొచ్చాయని అంటున్నారు. సునీల్ కనుగోలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. ఈయన కర్ణాటకలోని బళ్ళారి లో తెలుగు మాట్లాడే కుటుంబంలో జన్మించారు. చెన్నైలో చదువుకున్నారు. అమెరికాలో ఎంబీఏ చేశారు. అక్కడే ఓ కన్సల్టెన్సీ సంస్థలో పనిచేశారు. అసోసియేషన్ ఆఫ్ బ్రిలియంట్ మైండ్స్ కు సహ వ్యవస్థాపకుడిగా సునీల్ రాజకీయ వ్యూహకర్తగా తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈ సంస్థ భారతీయ జనతా పార్టీ కోసం వ్యూహాలు రూపొందించింది. 2014లో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రచారం చేయడానికి ప్రశాంత్ కిషోర్ తీసుకువచ్చిన సిటిజన్స్ ఫర్ కౌంటబుల్ గవర్నెన్స్ అంటే సిఐజిలోనూ భాగస్వామిగా ఉన్నారు.
బీజేపీతో తన అనుబంధానికి భిన్నంగా సునీల్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి వ్యూహాలు రచించారు. 2022లో కాంగ్రెస్ పార్టీ కీలక ఎన్నికల వ్యూహకర్తగా నియమితులయ్యారు. ఆ తర్వాత ఈయనను 2024 లోక్సభ పోల్స్ టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా సోనియా గాంధీ నియమించారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు వెనుక సునీల్ విభిన్నమైన ఆలోచనలు చక్కని ఇన్పుట్స్ ఉన్నాయని పార్టీ నాయకులు చెబుతుంటారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుతో సునీల్ మొదటి వ్యూహకర్తగా చక్కటి విజయాన్ని అందుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి భూమై 40 శాతం కమిషన్ తీసుకుంటున్నారని కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చేసిన ఆరోపణల పైన ఓ ప్రచార అస్త్రాన్ని సిద్ధం చేశారు. సామాన్యుడిని మెప్పించేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను సునీల్ బృందం తనదైన శైలిని ప్రదర్శించింది మహిళలకు ఆర్టీసీ బస్సులు, ఉచిత ప్రయాణం గ్యాస్ సబ్సిడీ తదితర ప్రజా ఆకర్ష పథకాల వెనుక సునీల్ ఉన్నారు . కర్ణాటకలో కాంగ్రెస్ గెలవగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సునీల్ సలహాదారుడిగా నియమించి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ గెలవడంలో కీలక పాత్ర పోషించారు.
కర్ణాటక తరహా లోనే కాంగ్రెస్ పార్టీ తరపున హామీలు ఇవ్వడంలో సునీల్ కీలక పాత్ర ఉంది. ఓటర్లను ఆకట్టుకునే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇవ్వడం వెనుక సునీల్ పాత్ర ఉందని ఆ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. కర్ణాటక తరహ వ్యూహాలను తెలంగాణలో అమలు చేయాలని ఆయన సూచించారని చెబుతారు. తెలంగాణలో 500 కి గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 , ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతు భరోసా మొత్తాన్ని 15 వేలకు పెంచడం, కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తింపు, వ్యవసాయ కార్మికులకు 12 వేల రూపాయలు, వరి పంటలకు ఏడాదికి 500 బోనస్, గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి 200 యూనిట్ల విద్యుత్ ఉచితం, ఇందిరమ్మ ఇల్లు, యువ వికాసం, చేయూత పథకాలతో కాంగ్రెస్ పార్టీ సామాన్యుల మనసులు గెలుచుకునేలా మేనిఫెస్టో రూపొందించడంలో సునీల్ పాత్ర ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…
Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…
Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…
Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…
Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…
Olive Oil vs Coconut Oil : గుండె ఆరోగ్యం కోసం ఏ నూనె ఉపయోగించాలి అనే విషయంపై ప్రజల్లో…
Gowtam Tinnanuri : విజయ్ దేవరకొండ vijay devarakonda కథానాయకుడిగా నటించిన చిత్రం 'కింగ్డమ్' kingdom movie . గౌతమ్…
This website uses cookies.