
Telangana Ration Card : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి సంబంధించి మార్గదర్శకాలు.. ఎవరెవరికి అందుతాయి..!
Telangana Ration Card : సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవం ఈ నెల 26 నుంచి పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రత రేషన్ కార్డులు జారీ కానున్నాయి. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం కోసం సర్కారు ముందడుగు వేసినట్లయింది. కొత్త రేషన్ కార్డుల మంజూరుతోపాటు.. పాత రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు కూడా చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డులు జారీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు కూడా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
Telangana Ration Card : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకి సంబంధించి మార్గదర్శకాలు.. ఎవరెవరికి అందుతాయి..!
ఈ నేపథ్యంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న వినతుల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇక కొత్త రేషన్ కార్డులను ఏ ప్రాతిపదికను లబ్ధిదారులకు అందించనున్నారంటే?. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇటీవల జరిగిన కుల గణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితా సిద్ధం చేశారు. ఈ జాబితాను జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ క్షేత్రస్థాయి పరిశీలన కోసం అందుకుంటారు. మండల స్థాయిలో ఎంపీడీవో లు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ బాధ్యతలు నిర్వహిస్తారు.
కేబినెట్ సబ్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరగనుంది. దరఖాస్తులను నిశితంగా పరిశీలించిన తర్వాత కుల గణన సర్వే ఆధారంగా చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను జిల్లా కలెక్టర్, కమిషనర్లకు క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీవో, యూఎల్బీలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ, వార్డులో ప్రదర్శిస్తారు.. ఈ సందర్భంగా చదివి వినిపించి చర్చించిన తర్వాత కొత్త రేషన్ కార్డులకు ఆమోదం లభించనుంది. . రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల అమలుపై అధికారులతో చర్చించారు. ఇందులో కొత్త రేషన్ కార్డులపై కీలక విషయం వెల్లడించారు. ముఖ్యమైన తేదీలను వెల్లడించారు. కొత్త రేషన్ కార్డుల కోసం జనవరి 16 నుండి 20 వరకు తెలంగాణ అంతటా ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. 21 నుండి 24 వరకు గ్రామ, వార్డు సమావేశాల్లో లబ్ధిదారుల ముసాయిదా జాబితాను ఉంచి, ప్రజల అభిప్రాయం తీసుకుంటామన్నారు. జనవరి 26 నుండి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కూడా వెల్లడించడం జరిగింది.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.