Categories: NewsTelangana

Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!

Telangana government : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం కింద కొత్త అప్‌డేట్‌ను ప్రకటించింది. ఇప్పటివరకు 3 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులను జమ చేశారు. కానీ, తాజా నిర్ణయంతో 3 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులను కూడా రైతు భరోసా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను రూపొందిస్తున్నారు. ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అయితే, సాగు యోగ్యం కాని భూములను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్‌ చేసి, వారికి రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది.

Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!

ప్రభుత్వం ఇప్పటివరకు 44.82 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ. 3,487.82 కోట్ల నిధులను జమ చేసింది. మొత్తం 58.13 లక్షల ఎకరాల భూమికి నిధులు అందాయి. ఈ పథకం నాలుగు విడతలుగా అమలు అయ్యింది. మొదటి విడత కింద 17.03 లక్షల మంది రైతులకు రూ. 557.54 కోట్లు, రెండో విడత కింద 13.23 లక్షల మంది రైతులకు రూ. 1,091.95 కోట్లు, మూడో విడత కింద 10.13 లక్షల మంది రైతులకు రూ. 1,269.32 కోట్లు, నాలుగో విడత కింద 9.12 లక్షల మంది రైతులకు సుమారు రూ. 1,000 కోట్లు కేటాయించారు. ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులకు మార్చి 31లోగా నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

అలాగే ప్రభుత్వం రైతు భరోసా నిధులు సరిగ్గా వినియోగించబడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సాగుకు అనర్హమైన భూములు, బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య సముదాయాలకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. మొత్తం 1.51 కోట్ల ఎకరాల భూమిలో 3 లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా లేదని గుర్తించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో మిగిలిన రైతులకు నిధులను పంపిణీ చేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Recent Posts

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

51 minutes ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

2 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

3 hours ago

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…

4 hours ago

Parents : బ్ర‌తికి ఉండ‌గానే కూతురుకి పిండం పెట్టిన త‌ల్లిదండ్రులు.. ఎందుకో తెలుసా?

Parents : నాడియా జిల్లాలో ఏకంగా బతికి ఉన్న‌ యువతికి కుటుంబ సభ్యులు పిండం పెట్ట‌డం కలకలం రేపింది. ప్రేమ…

5 hours ago

Sathyaraj : పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన కట్టప్ప

Sathyaraj : తమిళ సినీ నటుడు సత్యరాజ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఇటీవల…

6 hours ago

Jagapathi Babu : 2000 మంది కమ్మ పిచ్చోళ్లు.. మిమ్మ‌ల్ని న‌రికేస్తారంటూ జ‌గ‌ప‌తి బాబుకి వార్నింగ్ ఇచ్చారా..! వీడియో

Jagapathi Babu : టాలీవుడ్ సీనియర్ హీరో జగపతి బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఎన్నో సూపర్ హిట్…

7 hours ago

Ayurvedic Drinks : ఈ డ్రింక్స్ తో.. మీ కాలేయాన్ని.. 100 సంవత్సరాలపాటు పదిలంగా కాపాడుకోండి…?

Ayurvedic Drinks : శరీరానికి గుండె ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. ఆలయం పనితీరు సరిగ్గా ఉంటేనే…

8 hours ago