
Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!
Telangana government : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం కింద కొత్త అప్డేట్ను ప్రకటించింది. ఇప్పటివరకు 3 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులను జమ చేశారు. కానీ, తాజా నిర్ణయంతో 3 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులను కూడా రైతు భరోసా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను రూపొందిస్తున్నారు. ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అయితే, సాగు యోగ్యం కాని భూములను ప్రభుత్వం బ్లాక్లిస్ట్ చేసి, వారికి రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది.
Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!
ప్రభుత్వం ఇప్పటివరకు 44.82 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ. 3,487.82 కోట్ల నిధులను జమ చేసింది. మొత్తం 58.13 లక్షల ఎకరాల భూమికి నిధులు అందాయి. ఈ పథకం నాలుగు విడతలుగా అమలు అయ్యింది. మొదటి విడత కింద 17.03 లక్షల మంది రైతులకు రూ. 557.54 కోట్లు, రెండో విడత కింద 13.23 లక్షల మంది రైతులకు రూ. 1,091.95 కోట్లు, మూడో విడత కింద 10.13 లక్షల మంది రైతులకు రూ. 1,269.32 కోట్లు, నాలుగో విడత కింద 9.12 లక్షల మంది రైతులకు సుమారు రూ. 1,000 కోట్లు కేటాయించారు. ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులకు మార్చి 31లోగా నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే ప్రభుత్వం రైతు భరోసా నిధులు సరిగ్గా వినియోగించబడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సాగుకు అనర్హమైన భూములు, బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య సముదాయాలకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. మొత్తం 1.51 కోట్ల ఎకరాల భూమిలో 3 లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా లేదని గుర్తించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో మిగిలిన రైతులకు నిధులను పంపిణీ చేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
This website uses cookies.