Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!
Telangana government : రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు రైతు భరోసా పథకం కింద కొత్త అప్డేట్ను ప్రకటించింది. ఇప్పటివరకు 3 ఎకరాలలోపు భూమి కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకం ద్వారా నిధులను జమ చేశారు. కానీ, తాజా నిర్ణయంతో 3 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులను కూడా రైతు భరోసా పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే అర్హులైన రైతుల జాబితాను రూపొందిస్తున్నారు. ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేయనున్నారు. అయితే, సాగు యోగ్యం కాని భూములను ప్రభుత్వం బ్లాక్లిస్ట్ చేసి, వారికి రైతు భరోసా వర్తించదని స్పష్టం చేసింది.
Telangana government : మరోసారి తెలంగాణ సర్కార్ పెట్టుబడి సాయం అందించబోతుంది..ఎవరికంటే..!
ప్రభుత్వం ఇప్పటివరకు 44.82 లక్షల మంది రైతులకు రైతు భరోసా పథకం ద్వారా రూ. 3,487.82 కోట్ల నిధులను జమ చేసింది. మొత్తం 58.13 లక్షల ఎకరాల భూమికి నిధులు అందాయి. ఈ పథకం నాలుగు విడతలుగా అమలు అయ్యింది. మొదటి విడత కింద 17.03 లక్షల మంది రైతులకు రూ. 557.54 కోట్లు, రెండో విడత కింద 13.23 లక్షల మంది రైతులకు రూ. 1,091.95 కోట్లు, మూడో విడత కింద 10.13 లక్షల మంది రైతులకు రూ. 1,269.32 కోట్లు, నాలుగో విడత కింద 9.12 లక్షల మంది రైతులకు సుమారు రూ. 1,000 కోట్లు కేటాయించారు. ఐదు ఎకరాల భూమి కలిగిన రైతులకు మార్చి 31లోగా నిధులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అలాగే ప్రభుత్వం రైతు భరోసా నిధులు సరిగ్గా వినియోగించబడేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సాగుకు అనర్హమైన భూములు, బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, వాణిజ్య సముదాయాలకు ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది. మొత్తం 1.51 కోట్ల ఎకరాల భూమిలో 3 లక్షల ఎకరాల భూమి వ్యవసాయానికి అనువుగా లేదని గుర్తించారు. మిగతా 1.48 కోట్ల ఎకరాలకు రైతు భరోసా కింద నిధులు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఏప్రిల్ రెండో వారంలో మిగిలిన రైతులకు నిధులను పంపిణీ చేయనుంది. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి సాయం పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Team India : దుబాయ్ వేదికగా జరిగిన ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత క్రికెట్ జట్టు ఘన…
Bank Holidays : మార్చి 13, 14, 15 తేదీల్లో బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు బంద్ ఉండనున్నాయి.…
PM Internship Scheme 2025 : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఇంటర్న్షిప్ 2025 ప్రోగ్రామ్ నిరుద్యోగ యువతకు మంచి…
Union Bank of India : ఉద్యోగార్థులకు శుభవార్త! యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 దరఖాస్తు…
PM Kisan Scheme : దేశవ్యాప్తంగా రైతులకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి కిసాన్…
Amrutha : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పప్రణయ్రువు హత్య కేసులో కోర్టు తుది తీర్పును ప్రకటించింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు…
Rajendra Prasad : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రెండు సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి…
MLA Vemula Veeresham : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్మెయిల్ చేసిన…
This website uses cookies.