Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం నుండి తాజా అప్డేట్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం నుండి తాజా అప్డేట్..!

 Authored By sudheer | The Telugu News | Updated on :9 March 2026,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం నుండి తాజా అప్డేట్..!

  •  ఎక్కడయ్య రైతు భరోసా ..? రైతుల్లో ఆగ్రహపు జ్వాలలు

  •  Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం నుండి తాజా అప్డేట్..!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. సాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ‘రైతు భరోసా’ నిధుల విడుదల ఆలస్యం కావడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. యాసంగి సీజన్ ప్రారంభమై పంటలు చేతికి వచ్చే సమయం దగ్గరపడుతున్నా, ఇప్పటివరకు పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కాలేదు. ఫిబ్రవరి ఆఖరులో లేదా మార్చి మొదటి వారంలో నిధులు వస్తాయని ఆశగా ఎదురుచూసిన రైతులకు నిరాశే ఎదురైంది. ఎకరానికి రూ. 6,000 చొప్పున అందాల్సిన ఈ సాయం అందకపోవడంతో విత్తనాలు, ఎరువులు మరియు కూలీల ఖర్చుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన దుస్థితి ఏర్పడింది.

Rythu Bharosa రైతు భరోసా పై ప్రభుత్వం నుండి తాజా అప్డేట్

Rythu Bharosa : రైతు భరోసా పై ప్రభుత్వం నుండి తాజా అప్డేట్..!

Rythu Bharosa : రైతు భరోసా అప్డేట్ ఇస్తున్నారు తప్ప జమ మాత్రం చేయడం లేదు !!

ప్రభుత్వ యంత్రాంగం నుండి స్పష్టమైన ప్రకటన లేకపోవడం ఈ అనిశ్చితిని మరింత పెంచుతోంది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే నిధులు విడుదల చేస్తామని గతంలో హామీ ఇచ్చినప్పటికీ, ఆచరణలో అది సాకారం కాలేదు. దీంతో రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ అధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ, రైతు భరోసా నిధులు ఇతర అవసరాలకు మళ్లిస్తున్నారని చేస్తున్న ప్రచారం క్షేత్రస్థాయిలో రైతులలో గందరగోళాన్ని సృష్టిస్తోంది. అసలు ఈ సీజన్‌కు సాయం అందుతుందా లేదా అన్న అనుమానాలు సామాన్య రైతును వేధిస్తున్నాయి.

రైతు భరోసా జమ చేస్తారా లేదా అంటూ రైతుల డిమాండ్

ఈ క్లిష్ట పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రైతు భరోసాపై ఒక స్పష్టమైన అధికారిక ప్రకటన చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. ఆర్థికంగా చితికిపోతున్న తరుణంలో ప్రభుత్వం ఇచ్చే ఈ చిన్న సాయం తమకు కొండంత అండగా ఉంటుందని వారు భావిస్తున్నారు. నిధుల విడుదలలో జాప్యం జరిగే కొద్దీ రైతులపై ఆర్థిక భారం పెరిగి, అది వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి, ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన నిధులను మంజూరు చేసి, అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం ద్వారా వారిలో నెలకొన్న భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

sudheer

Ramanujam Sudheer Sr Journalist is experienced in Digital Media field. He worked in various Telugu media for about 10 years. lam worked as a Vaartha Daily Newspaper , 123telugu , Cineoutlook, Telugu Mirchi, TeluguMovies. com, Hashtagu, Mahaa News tv channel telugu As a News content writer, he wrote various articles on Human angle, Andhra pradesh And Telangana Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Conterwriter of thetelugunews.com website. Contact Details : Sudheer7606@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి