Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్న్యూస్... రైతు భరోసా కీలక ప్రకటన..!
Rythu Bharosa : తెలంగాణ Telangana ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుండడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే రూ.2 లక్షల రైతు రుణమాఫీ పూర్తి చేశారు. మెుత్తం 4 విడతల్లో దాదాపు 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 22 వేల కోట్లు జమ చేశారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో రైతు భరోసా పథకం కూడా ఒకటి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసం ఎకరాకు రూ. 10 వేలు రెండు విడతల్లో జమ చేసేవారు. ఈ పథకాన్నే రైతు భరోసాగా పేరు మార్చి ఎకరాకు రూ. 15 వేలు ఇచ్చేందుకు రెడీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం కింద రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది…
Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్న్యూస్… రైతు భరోసా కీలక ప్రకటన..!
తాజాగా రైతు భరోసాపై తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రైతు భరోసా ని ఏ రైతుకు ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.. ఇప్పటికే రైతు బంధు పథకం కింద కాంగ్రెస్ ప్రభుత్వం రూ.7,625 వేల కోట్లు ఇచ్చిందని, రైతు రుణమాఫీ పథకం కింద రూ. 21 వేల కోట్లను రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. సన్న ధాన్యానికి బోనస్ కూడా ఇచ్చామన్నారు. ఈ క్రమంలో రైతు భరోసాపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. పంట వేసిన ప్రతి రైతుకూ, రైతు భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ ఆలోచన అని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.
సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు సంక్రాంతి తర్వాత ఇస్తామని చెప్పడం అనేక సందేహాలు కలిగిస్తుంది.. ఇలా మాట మార్చడానికి ప్రధాన కారణం.. గైడ్లైన్స్ ఇంకా రూపొందించకపోవడమే. ఎవరిని అర్హులుగా చెయ్యాలో, ఎవర్ని అనర్హులుగా చెయ్యాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోంది. అవతల ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలతో రైతులను రెచ్చగొడుతున్నాయని ప్రభుత్వం ఫైర్ అవుతోంది. ఆదివారం (డిసెంబర్ 30) సెక్రటేరియట్లో రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు, కమిటీ సభ్యులైన తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబులు అధికారులతో సమావేశమై చర్చించారు. గతంలో మాదిరగా కాకుండా రైతు భరోసా నిధులను కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సొమ్మును ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా కానివ్వమని చెప్పారు..
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…
This website uses cookies.