Home » Exclusive » Telangana Govt Release Crop Damage Compensation For Farmers
Exclusive

Farmers : రైతన్నలకు తెలంగాణ సర్కార్ శుభవార్త… అలాంటి వారి ఖాతాల్లో ఎకరాకు రూ.10,000..!

Authored By
Ramu Tandu Ramalingaiah
The Telugu News | Published on: May 2, 2024, 8:00 am
Advertisement

Farmers : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక ఎన్నికల జోరు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ మరియు లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికల జరుగుతున్నాయి. ఇక లోక్ సభ ఎన్నికలు నాలుగో దశలో భాగంగా మే 13న రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వీటిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఖాతాలో పడాల్సిన డబ్బులు ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఇప్పుడు అధికారులు ఎన్నికల కమిషన్ నుండి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని ఆ పథకానికి లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి కూడా లభించడంతో త్వరలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నట్లుగా సమాచారం. అవి కూడా ఎకరానికి రూ.10,000 ఇవ్వడం విశేషం. ఇంతకీ రైతన్నలకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు.. ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

రైతన్నల ఖాతాలో ఎకరాకు రూ.10,000….

రైతన్నల కష్టం గురించి మాటల్లో చెప్పడం కష్టమైన పని. ఎందుకంటే రైతన్నలను ప్రభుత్వాలతో పాటు ప్రకృతి కూడా మోసం చేస్తూ వారితో ఆడుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకసారి వర్షాలు లేకుండా ప్రకృతి ఇబ్బంది పెడితే మరోసారి అతివృష్టి , వరదలతో పంటను నాశనం చేస్తుంది. ఇలాంటి తరుణంలోనే ప్రభుత్వాలు రైతన్నలకు అండగా నిలబడతామని ముందుకు వస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఇదే పని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత నెల వడగల్లు మరియు అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన దీనికి ఈసీ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఈసీ మద్దతు కూడా లభించడంతో వ్యవసాయ శాఖ వర్గాలు పంట నష్టపోయినటువంటి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు పూనుకున్నట్లుగా తెలుస్తోంది . అయితే మార్చి నెలలో పడినటువంటి అకాల వర్షాలకు దాదాపు 15,814 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ నిర్ధారించిన సంగతి మనందరికీ తెలిసిందే.

Farmers : రైతన్నలకు తెలంగాణ సర్కార్ శుభవార్త… అలాంటి వారి ఖాతాల్లో ఎకరాకు రూ.10,000..!

Advertisement

దాదాపు 10 జిల్లాలలో పంటలకు నష్టం వాటిల్లినట్లుగా వ్యవసాయ శాఖ పేర్కొంది. ఇక ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతు సోదరులకు ఆర్థిక సాయం చేసేందుకు…వారందరికీ ఎకరాకు 10వేలు చొప్పున మొత్తం 15.81 కోట్ల పరిహారం అందజేయాలని నిర్ణయించుకుంది. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హాయంలో ఒకసారి ఇలాగే తీవ్రమైన వర్షాలతో పంట నష్టం జరిగినప్పుడు ఎకరాకు 10వేలు చొప్పున రైతన్నలకు ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతన్నలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి