
Farmers : రైతన్నలకు తెలంగాణ సర్కార్ శుభవార్త... అలాంటి వారి ఖాతాల్లో ఎకరాకు రూ.10,000..!
Farmers : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక ఎన్నికల జోరు కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ మరియు లోక్ సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికల జరుగుతున్నాయి. ఇక లోక్ సభ ఎన్నికలు నాలుగో దశలో భాగంగా మే 13న రెండు తెలుగు రాష్ట్రాలలో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కొన్ని సంక్షేమ పథకాలు అర్ధాంతరంగా ఆగిపోయాయి. వీటిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ఖాతాలో పడాల్సిన డబ్బులు ప్రక్రియ ఆగిపోయింది. అయితే ఇప్పుడు అధికారులు ఎన్నికల కమిషన్ నుండి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని ఆ పథకానికి లైన్ క్లియర్ చేసినట్లుగా తెలుస్తుంది. అంతేకాక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనుమతి కూడా లభించడంతో త్వరలోనే రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నట్లుగా సమాచారం. అవి కూడా ఎకరానికి రూ.10,000 ఇవ్వడం విశేషం. ఇంతకీ రైతన్నలకు డబ్బులు ఎందుకు ఇస్తున్నారు.. ఈ పథకానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రైతన్నల కష్టం గురించి మాటల్లో చెప్పడం కష్టమైన పని. ఎందుకంటే రైతన్నలను ప్రభుత్వాలతో పాటు ప్రకృతి కూడా మోసం చేస్తూ వారితో ఆడుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఒకసారి వర్షాలు లేకుండా ప్రకృతి ఇబ్బంది పెడితే మరోసారి అతివృష్టి , వరదలతో పంటను నాశనం చేస్తుంది. ఇలాంటి తరుణంలోనే ప్రభుత్వాలు రైతన్నలకు అండగా నిలబడతామని ముందుకు వస్తారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రస్తుతం ఇదే పని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గత నెల వడగల్లు మరియు అకాల వర్షాలతో పంట నష్టపోయినటువంటి రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటం వలన దీనికి ఈసీ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఈసీ మద్దతు కూడా లభించడంతో వ్యవసాయ శాఖ వర్గాలు పంట నష్టపోయినటువంటి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు పూనుకున్నట్లుగా తెలుస్తోంది . అయితే మార్చి నెలలో పడినటువంటి అకాల వర్షాలకు దాదాపు 15,814 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లుగా వ్యవసాయ శాఖ నిర్ధారించిన సంగతి మనందరికీ తెలిసిందే.
Farmers : రైతన్నలకు తెలంగాణ సర్కార్ శుభవార్త… అలాంటి వారి ఖాతాల్లో ఎకరాకు రూ.10,000..!
దాదాపు 10 జిల్లాలలో పంటలకు నష్టం వాటిల్లినట్లుగా వ్యవసాయ శాఖ పేర్కొంది. ఇక ఈ అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయినటువంటి రైతు సోదరులకు ఆర్థిక సాయం చేసేందుకు…వారందరికీ ఎకరాకు 10వేలు చొప్పున మొత్తం 15.81 కోట్ల పరిహారం అందజేయాలని నిర్ణయించుకుంది. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి ఇదిలా ఉండగా గత ప్రభుత్వ హాయంలో ఒకసారి ఇలాగే తీవ్రమైన వర్షాలతో పంట నష్టం జరిగినప్పుడు ఎకరాకు 10వేలు చొప్పున రైతన్నలకు ఆర్థిక సాయం అందించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతన్నలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.