Telangana : తెలంగాణ అధికారిక చిహ్నం ఇదేనట.. దాదాపు ఫైనల్ అయినట్టే..!
Telangana : తెలంగాణలో ఇప్పుడు అధికారిక చిహ్నం చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారిక చిహ్నం మార్పుపై దృష్టి సారించింది. రాజముద్రలో రాజచిహ్నాలు ఉండొద్దని రేవంత్ భావిస్తున్నారు. అందుకే ఆ చిహ్నం మార్పుకోసం ఆదేశించారు. కాగా ఇప్పటికే చాలా లోగోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఈ చిహ్నం ఉంటే బాగుంటుంది అంటూ కొన్ని ఫొటోలను కొందరు పోస్టులు చేస్తున్నారు. రాబోయే రెండు రోజుల్లోపు ఆ చిహ్నాన్ని ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.
అయితే పెయింటర్ రాజేష్ ఇప్పటికే 37 రకాల చిహ్నాలను సర్కార్ కు అందజేశారంట. అందులో చాలా రకాల చిహ్నాలు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో ప్రధానంగా మూడు చిహ్నాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అందులో ప్రధానంగా ఒక దాన్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. ఆ చిహ్నం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ లో ఉండిపోయింది. ఇందులో భారత జాతీయ చిహ్నం అయిన మూడు సింహాలతో పాటు కింద అమర వీరుల స్థూపం ఉంది. మధ్యలో వరి కంకులు ఉన్నాయి. పైగా తెలంగాణ ప్రభుత్వం అని నాలుగు భాషల్లో రాసి ఉంది.
Telangana : తెలంగాణ అధికారిక చిహ్నం ఇదేనట.. దాదాపు ఫైనల్ అయినట్టే..!
తెలుగు, హిందీ, ఉర్ధూ, ఇంగ్లిష్ లో తెలంగాణ ప్రభుత్వం అని రాసి ఉంది. అందుకే ఇప్పుడు దాన్ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే రెండు రోజుల్లో దీన్నే ఫైనల్ చేస్తారని అంటున్నారు. వాస్తవానికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ రాష్ట్ర గీతంతో పాటు చిహ్నాన్ని కూడా విడుదల చేయాలని భావించారు. అందుకే ఇంత త్వరగా దాన్ని ఫైనల్ చేసే పనిలో పడ్డారు. అయితే ఈ మార్పుపై బీఆర్ ఎస్ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ సాంస్కృతిని దెబ్బ తీస్తున్నారంటూ మండిపడుతున్నారు.
కానీ అధికారిక చిహ్నంలో రాజ ముద్ర వాసనలు ఎందుకు అంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. తమకు రాజకీయ చిహ్నాలు వద్దని.. తెలంగాణ కోసం పోరాడిన వారి గుర్తింపు ముఖ్యం అంటున్నారు.
Anganwadi Posts : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు త్వరలోనే శుభవార్త చెప్పనుంది. 4,687 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ…
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా…
Gupt Navratri : ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిని పూజించేందుకు, నాలుగు రకాల నవరాత్రులు వస్తాయి. నవరాత్రులు అనగానే గుర్తుకు…
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
This website uses cookies.