Telangana : తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్.. రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్..!
Telangana : తెలంగాణ సర్కార్ ప్రజలకి ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇకపై తెలంగాణలో అత్యంత చౌకగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి. టి ఫైబర్ ద్వారా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా ప్రతి ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్ను ప్రభుత్వం 300 రూపాయలకే ఇవ్వనుంది. ఈ కనెక్షన్ ద్వారా ప్రతి ఇంట్లో ఉన్న టీవీని కంప్యూటర్ మాదిరిగా వినియోగించుకోవచ్చు. దీని ద్వారా టీవీలోనే ప్రత్యేక వెసులబాటును కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. 20 ఎంబిబిఎస్ స్పీడ్తో ఇంటర్నెట్ కనెక్షన్ అందివ్వనుంది ప్రభుత్వం. ఇందులో పలు తెలుగు ఓటీటీలు కూడా అందుబాటులో ఉంటాయి.
Telangana : తెలంగాణ ప్రజలకి గుడ్ న్యూస్.. రూ.300కే ఇంటర్నెట్ కనెక్షన్..!
ఈ ప్రాజెక్టు తొలి దశలో తెలంగాణ వ్యాప్తంగా 94 మండలాలు, 2,096 గ్రామ పంచాయతీల్లో కమర్షియల్ సేవలు అందించేందుకు వీలుగా ఇప్పటికే పనులు పూర్తయ్యాయి. 30 వేల ప్రభుత్వ సంస్థలను అనుసంధానించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు టీఫైబర్ సంస్థ వేణు ప్రసాద్ వెల్లడించారు. ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ లో భాగంగా తొలిదశలో నారాయణపేట, సంగారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోని మద్దూరు, సంగుపేట్, అడవి శ్రీరామ్పూర్ గ్రామాల్లో టీ ఫైబర్ ట్రయల్ సేవలను ఈనెల 8న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు.
ఈ కనెక్షన్ తీసుకుంటే వర్చువల్ నెట్వర్క్తో పాటు టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పలు తెలుగు ఓటీటీలను సైతం ప్రజలు చూడటానికి వీలుపడుతుంది. తొలి దశలో నారాయణపేట, పెద్దపల్లి, సంగారెడ్డి జిల్లాల్లోని 2,096 పంచాయతీల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఆ తర్వాత మిగిలిన గ్రామాల్లోనూ ఏర్పాట్లు పూర్తిచేయనున్నారు. భారత్ నెట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించగా.. ఈ పథకం కింద తెలంగాణలోని గ్రామాల్లో ప్రతి ఇంటికి అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఇంటర్నెట్ కల్పించేందుకు ఫైబర్ నెట్ కనెక్షన్ను అందించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
Chaurya Paatam : అమెజాన్ ప్రైమ్లో ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అదే 'చౌర్య పాఠం' (Chaurya Paatam).…
Motorola Edge 50 : మోటోరోలా ఫోన్పై ఖతర్నాక్ డిస్కౌంట్ ప్రకటించారు. రూ.22వేల లోపు కొత్త ఫోన్ కొనేవారికి మోటోరోలా…
Good News : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. విద్యుత్ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.…
Women : మహిళలని ప్రోత్సహించేందుకు మోదీ సర్కారు అనేక పథకాలు తీసుకొస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వాటిలో ముద్రా…
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్…
Sekhar Kammula : సాధారణంగా శేఖర్ కమ్ముల చాలా స్లో అండ్ స్టడీగా సాగుతుంటాయి. ఆయన సినిమాల్లో స్టార్ హీరోలు,…
Watermelon : కొన్ని సీజనల్గా వచ్చే పండ్లను తింటే ఆరోగ్యకరమని ఆ సీజన్లో లభించే పండ్లను అప్పుడే తినడానికి ఎక్కువ…
Yoga Asanas : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా రంగంలో మరో ఘనత నమోదైంది. కర్ణాటక రాష్ట్రంలోని హసన్కు…
This website uses cookies.