Categories: NewsTelangana

AIYF : దేశ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్న సంపన్నుల ఆస్తులను జాతీయం చేయాలి : ఏఐవైఎఫ్

Advertisement
Advertisement

AIYF : దేశంలోని వనరులను యధేచ్చగా దోచుకుంటున్న సంపన్నులు ముకేష్ అంబానీ, ఆదానీ ఇతర బడా వ్యాపారస్తుల ఆస్తులను జాతీయం చేయాలని,యువతను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం ఉద్యమించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ తెలంగాణ రాష్ట్ర కన్వెన్షన్ హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ రెడ్డి భవన్ లో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ కార్పొరేట్ సంపన్నులు దేశాన్ని అన్ని రకాలుగా దోచుకుని తమ ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటున్నారని, కానీ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి లో మాత్రం వారి పాత్ర సూన్యమని వారు ఆరోపించారు. ఆర్ధిక స్థిరత్వం అంటే దేశ అభివృద్ధి అని, కానీ కార్పొరేట్ శక్తుల నినాదం మాత్రం తమ వ్యాపార సామ్రాజ్యాల ఎదుగుదలే ప్రధాన ధ్యేయమని వారు ఉద్ఘాటించారు. కార్పొరేట్ శక్తుల విధానాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి బహుళజాతి కంపెనీలకు రెడ్ కార్పెట్ వేసిన పాలకుల తీరు సిగ్గుచేటని, దీని మూలంగానే భారతదేశ యువతకు ఉపాధి అవకాశాలు దక్కడం లేదని వారు వాపోయారు.దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని వారు ఆవేదన వ్యక్తంచేశారు. 2023లో కార్పొరేట్ పన్ను 30 నుండి 22 శాతానికి తగ్గించారు. సంపద పన్ను తగ్గింపు వల్ల 950 కోట్ల రూపాయలు, కార్పొరేట్ పన్ను తగ్గింపుతో లక్ష కోట్ల రూపాయల రెవిన్యూ లోటు 2023లో కలిగిందన్నారు.

Advertisement

AIYF : దేశ వనరులను యథేచ్ఛగా దోచుకుంటున్న సంపన్నుల ఆస్తులను జాతీయం చేయాలి : ఏఐవైఎఫ్

AIYF : యువతను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై నిరంతరం ఉద్యమించాలి

మొదటసారిగా కార్పొరేట్ పన్ను చెల్లింపులు ఆదాయం పన్ను కంటే తగ్గిపోయాయని, దీని ఫలితంగా పారిశ్రామికవేత్తలు, అత్యంత ధనికుల లాభాలు గత మూడు సంవత్సరాల్లో 57 శాతం పెరిగినవని వారు ఉద్ఘాటించారు. దేశంలో ధనికులు రోజుకు రూ.2,200 కోట్లు వెనకేసుకుంటున్నారని వారు తెలిపారు. కానీ, సామాన్యుడి రోజూ వారి జీవన ఆర్ధికం మాత్రం పెరగడం లేదని ఆవేదన అన్నారు.ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర లు సంయుక్తంగా మాట్లాడుతూ భారతదేశంలోనే యువత ఎక్కువ ఉందని చెప్పారు. ప్రపంచంలో 186 కోట్లమంది యువజనులు ఉంటే అందులో 28 శాతం భారతీయులేనన్నారు. నవ యువకులతో నవనవలాడుతున్న యువజన దేశం భారత్ అన్నారు. ఏ దేశానికి లేనంత యువ సంపద మనకున్నప్పటికీ ఉత్తేజం, ఉత్సాహం కరువయ్యాయన్నారు. పాలకుల వినాశకర విద్యా విధానాల కారణంగా దేశంలోని 30శాతం మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అకాశాలు లేవన్నారు. రాష్ట్ర విభజన హామీలకు దిక్కులేదని,బయ్యారం ఉక్కు పరిశ్రమ ఊసే లేదన్నారు. ఖాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వవిద్యాలయం,సైనిక్ స్కూల్స్ వంటి హామీలను నెరవేర్చలేదన్నారు.కనీసం వీటినైనా నిర్మించి ఉంటే వేలాది మందికి ఉపాధి లభించి ఉండేదన్నారు.

Advertisement

ప్రభుత్వాలు అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాల ఫలితంగా చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదని విమర్శించారు. డిగ్రీలు, పీజీలు, పీహెచ్ఎలు బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, లా కోర్సులు చదివినవారు కూడా చివరకు రైల్వే గ్యాంగ్మన్ ఉద్యోగాలకు, పోలీస్ కానిస్టేబుల్, హోంగార్డు ఉద్యోగాలకు అవకాశాలు లేక వలస పోయే వారు కొందరైతే, మరికొంతమంది నిరాశ, నిస్పృహలతో కొకొయిన్, హెరాయిన్ వంటి మత్తుమందులకు బానిసలవుతున్నారన్నారు. అవినీతి, దోపిడీలకు ఆస్కారం లేని సమాజం యువత ఆకాంక్ష అని చెప్పారు. ఇది యువతతోనే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వెంకటేశ్వర్లు,లింగం రవి,బిజ్జ శ్రీనివాసులు, యుగంధర్,పేరబోయిన మహేందర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆర్. బాలకృష్ణ, సల్మాన్ బేగ్,షేక్ మహమూద్,శివ కుమార్,మధు,బోనగిరి మహేందర్, మస్క సుధీర్, మోగిలి లక్ష్మణ్, మహేష్, మాజీద్ అలీ ఖాన్,కళ్యాణ్, మానస్ కుమార్,మార్కపూరి సూర్య, రాజేష్, మధు, ప్రవీణ్, అశోక్, రాజ్ కుమార్,వెంకటేష్ లతో పాటు 100మంది పాల్గొన్నారు.

Recent Posts

Winter Season : చలికాలంలో ఒక్కొక్కరికి ఒక్కో అనుభూతి ఎందుకు?.. శరీరం చెప్పే సైన్స్ ఇదేనా?

Winter Season : చలికాలం మొదలైతే మన చుట్టూ ఒక విచిత్రమైన దృశ్యం కనిపిస్తుంది. కొందరు మంచు గాలులు వీచినా…

47 minutes ago

Mouni Amavasya : మౌని అమావాస్య ప్రాముఖ్యత : ఈ పవిత్ర రోజున పాటించాల్సిన నియమాలు, చేయవలసిన పూజలు..!

Mouni Amavasya : మాఘ మాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్యగా పిలుస్తారు. హిందూ సంప్రదాయాల్లో ఈ తిథికి విశేషమైన…

2 hours ago

Zodiac Signs January 18 2026 : జ‌న‌వ‌రి 18 ఆదివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Zodiac Signs January 18 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…

3 hours ago

Kavitha : సిద్దిపేట ఎమ్మెల్యేగా క‌విత‌… ఏం జ‌రుగుతుంది..?

Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…

11 hours ago

Mana Shankara Vara Prasad Garu Movie : బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. 5 రోజుల్లో రూ.226 కోట్ల గ్రాస్

Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…

12 hours ago

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీలో కోట్ల మౌనం.. పార్టీపై అసంతృప్తితో ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ?

Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…

13 hours ago

Smart TV : రూ.7,499కే 32 అంగుళాల స్మార్ట్ టీవీ..! తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు – నెటిజన్లను ఆకట్టుకుంటున్న డీల్

Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…

16 hours ago

Kethireddy Pedda Reddy : తాడిపత్రిలో రాజకీయ వేడి .. జేసీ పాలనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్

Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…

17 hours ago