Home » News » The Priest Who Killed Apsara That She House Owner Sensational Comments On Saikrishna
News

Apsara Murder Case : అప్సరని హత్య చేసిన పూజారి.. అర్ధరాత్రులు అంటూ అసలు బాగోతం బయటపెట్టిన ఇంటి ఓనర్…!!

Authored By
Breaking News
The Telugu News | Published on: June 10, 2023, 5:00 pm
Advertisement

Apsara Murder Case  : హైదరాబాద్ సరూర్ నగర్ లో అప్సర అనే యువతి మర్డర్ కేస్ రెండు తెలుగు రాష్ట్రాలను ఉలిక్కిపడేలా చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘాతుకానికి ఒక పురోహితుడు పాల్పడటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వివాహేతర సంబంధం వల్లే అప్సరా మృతి చెందిందని పోలీసులు తెలియజేశారు. అప్సర పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో పురోహితుడు సాయికృష్ణ ఆమెను చంపినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement

కాగా ఈ కేసులో అప్సర ఉంటున్న ఇంటి యజమాని కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని తమిళ సినిమాల్లో నటించిన అప్సర ఆ తరువాత హైదరాబాద్ లో వచ్చి సీరియల్స్ లో నటించేందుకు ప్రయత్నాలు చేయడం జరిగింది. ఈ క్రమంలో తాము ఉంటున్న ప్రాంతంలో బంగారు మైసమ్మ గుడికి తరచూ వెళ్లేదని తెలిపారు. అయితే ఆ ఆలయంలో పూజారిగా ఉన్న సాయి కృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఆ పరిచయాన్ని ఆమె కుటుంబంతోను సాయి కృష్ణ కొనసాగించాడని ఇంటి ఓనర్స్ స్పష్టం చేశారు. ఇద్దరిది ఒకే కమ్యూనిటీ కావడంతో త్వరగా కలిసిపోయారని అక్కయ్య గారు అంటూ అప్సరతో సాయి కృష్ణ వరసలు కలిపేవాడు.

the priest who killed apsara that she house owner sensational comments on saikrishna

Advertisement

ఆ రకంగా ఆమెకు దగ్గరయ్యాడు. అర్ధరాత్రి 11 గంటల వరకు వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. కొన్ని రోజులు అర్ధరాత్రులు కూడా అక్కడే ఉండేవాడు. మిడ్ నైట్ వాళ్ళిద్దరూ బైక్ మీద బయటకు వెళ్లేవారు. అయితే ఈ క్రమంలో తమ కొడుకుకి అనుమానం వస్తే వాళ్ళిద్దరి మధ్య అన్నా చెల్లెల బంధం ఉందని నచ్చజెప్పి… సముదాయించే వాళ్ళం. అప్పుడే అనుమానం వస్తే ఇల్లు ఖాళీ చేయించే వాళ్ళమని అప్సర ఇంటి ఓనర్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి