Thummala Nageswara Rao : రైతుల‌కి తీపి క‌బురు అందించిన మంత్రి తుమ్మ‌ల‌..అన్న‌దాత‌ల‌కి మ‌రింత వెసులుబాటు..!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: May 5, 2024, 12:00 pm

Thummala Nageswara Rao : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఇచ్చిన మాట‌లని ఒక్కొక్క‌టిగా నిలబెట్టుకుంటూ వ‌స్తున్నారు. అయితే రైతుల విష‌యంలో ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చొర‌వ తీసుకుంటుంది. జొన్నల కొనుగోలులో నిబంధనలను సడలించి అన్నదాతకు మరింత వెసులుబాటు కల్పించేలా ప్ర‌య‌త్నాలు చేస్తుంది. తాజాగా జొన్నలు తక్కువ ధరకు అమ్ముకోవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జొన్న రైతులకు సూచించారు. అదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల జొన్న రైతుల విజ్ఞప్తి మేరకు, సంబంధిత జిల్లా అధికారుల నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఎకరాకు 8.85 నుంచి 12 క్వింటాళ్ల వరకు పరిమితి పెంచుతుందన్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఇప్పటికే క్వింటాల్‌కు రూ.3180 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తున్నామన్నారు.

Thummala Nageswara Rao : రైతుల‌కి గుడ్ న్యూస్

కొనుగోలు ఏజెన్సీ మార్క్‌ఫెడ్‌కు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జొన్నల కొనుగోళ్లు ప్రారంభించిన మార్క్‌ఫెడ్‌ క్వింటాల్‌కు రూ.3,180చొప్పున రైతులకు చెల్లిస్తోంది. జొన్న రైతులెవరూ తొందరపడి తక్కువ ధరకు పంటను విక్రయించొద్దని మంత్రి సూచించారు.పెంచిన పరిమితి ప్రకారం ప్రభుత్వం జొన్న రైతులవద్ద నుంచి మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని చెప్పారు. ఎకరాకు 8.85 క్వింటాళ్ల జొన్నలే కొనాలని ఐదేళ్ల క్రితం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిమితులు విధించింద‌ని, ఆ ప‌రిమితిని పెంచాలంటూ కొద్ది రోజుల క్రితం ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల రైతులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి త‌మ బాధ‌ల‌ని చెప్పుకున్నారు.

Thummala Nageswara Rao : రైతుల‌కి తీపి క‌బురు అందించిన మంత్రి తుమ్మ‌ల‌..అన్న‌దాత‌ల‌కి మ‌రింత వెసులుబాటు..!

Thummala Nageswara Rao : రైతుల‌కి తీపి క‌బురు అందించిన మంత్రి తుమ్మ‌ల‌..అన్న‌దాత‌ల‌కి మ‌రింత వెసులుబాటు..!

అయితే వారి విజ్ఞ‌ప్తి మేర‌కు అధికారుల నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుని ఈ పరిమితిని 12 క్వింటాళ్లకు పెంచుతూ తాజాగా ఆదేశాలివ్వ‌డంతో వారిలో సంతోషం వెల్లివెరిసింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో 1.05 లక్షల ఎకరాల్లో జొన్న పంటను గత అక్టోబరు నుంచి మార్చి వరకూ రబీ సీజన్‌లో పండించ‌డం మ‌నం చూశాం.ఇప్పుడు 14 ల‌క్ష‌ల క్వింటాళ్లకి పైగా దిగుబ‌డి వ‌స్తుంద‌ని బావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితిని పెంచడం వల్ల ఎకరానికి ప్రతి రైతుకు తప్పనిసరిగా మద్దతు ధర కింద 12 క్వింటాళ్లకు రూ.38,160 అందునుంద‌ని అంటున్నారు.

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp