TRS Party
12 TRS MLAs : టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండు ఎమ్మెల్సీ స్థానాలను కూడా గెలవాలనే పట్టుదలతో కేసీఆర్ మరియు కేటీఆర్ ప్రత్యేకంగా ప్రచార వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రులు జీడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇలా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసం పని చేసే విధంగా ఒక పైప్ లైన్ ను ఏర్పాటు చేశారు. దాని ప్రకారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న తమ నియోజక వర్గాల్లో ప్రతి రోజు పర్యటనలు చేస్తూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాల్సి ఉంది. కాని కొందరు ఎమ్మెల్యేలు మరియు మంత్రులు మాత్రం తమకు పట్టనట్లుగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదు.
కింది స్థాయి కార్యకర్తలు మరియు నాయకులు మినహా ఎమ్మెల్సీలు చాలా మంది ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంకు డుమ్మా కొడుతున్నట్లుగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కేటీఆర్ దృష్టికి వచ్చిందట. దాంతో ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు మరియు కార్యకర్తలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం చేస్తేనే గెలుపుపై అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఎమ్మెల్యేలు అంతా కూడా ప్రచారంకు దూరంగా ఉంటే పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ఎమ్మెల్యేలకు కేటీఆర్ క్లాస్ పీకాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
TRS Party
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కనీసం ఒక్క సారి కూడా నియోజక వర్గంలో పర్యటించకుండా హైదరాబాద్ లో ఉండి తమ పనులను చక్కబెట్టుకుంటూ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం 12 మంది ఉన్నారు. వారిలో కొందరు అనారోగ్య సమస్యలు చెప్పి ఎండకు వెళ్లడం కష్టంగా ఉందని చెప్తే మరి కొందరు ఇతర కారణాలు చెబుతున్నారు. ఒక వేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏ ఒక్క అభ్యర్థి ఓడిపోయినా కూడా ఆ ఓడిపోయిన అభ్యర్థికి నియోజక వర్గంలో ఉన్న ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు మార్చేందుకు నియోజక వర్గ ఇన్ చార్జ్ లను ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. అంటే వారికి తదుపరి ఎన్నికల్లో సీటు రావడం కష్టం. అందుకే ఈ చివరి రోజుల్లో అయినా ఆ ఎమ్మెల్యేలు ప్రచారం చేసేందుకు ముందుకు వస్తారా అనేది చూడాలి.
Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…
High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…
Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…
AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…
YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…
Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయన్న దానికి ఇదొక ఉదాహరణ. ఎంతో కష్టపడి, కన్న…
Samantha Sreeleela : అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…
Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…
This website uses cookies.