Health Benefits : మనం రోజూ తినే ఆహారంలో ఎన్నో రకాలు ఉంటాయి. కొన్ని తాగేవి ఉంటాయి.. ఇంకొన్ని ఉడకబెట్టుకొని తినేవి ఉంటాయి.. ఇంకొన్ని నానబెట్టి తినేవి ఉంటాయి. అయితే.. ఉడకబెట్టి తినే వాటి కన్నా కూడా.. నానబెట్టి తినే పదార్థాల వల్ల మనకు ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. మరి.. అలా నానబెట్టి తినాల్సిన ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతులు ఆరోగ్యానికి చేసే మేలు ఇంకేవీ చేయవు. సాధారణంగా మెంతులను కూరల్లో వాడుతుంటాం. కొందరు మెంతులను పొడి చేసుకొని.. దాన్ని కూరల్లో వేసుకొని తింటుంటారు. అయితే.. మెంతులను ఇలా కాకుండా.. రాత్రి నానబెట్టి.. రోజూ ఉదయాన్నే వాటిని తిని.. మెంతులను నానబెట్టిన నీటిని కూడా తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉంటాయి.
రోజూ రాత్రి రెండు చెంచాల మెంతులను నానబెట్టి ఉదయమే వాటిని తిని.. ఆ నీటిని తాగితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిలో ఉంటే పీచు వల్ల పేగులను శుభ్ర పరిచి మలబద్ధకం లేకుండా చేస్తుంది. రక్తంలో చెక్కర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అలాగే.. నెలసరి సమయంలో వచ్చే కడుపునొప్పి కూడా తగ్గుతుంది.
అవిసె గింజలను కూడా రాత్రి కొన్ని నానబెట్టి.. ఉదయాన్ని తింటే ఆరోగ్యానికి మంచిది. వీటిలో పీచు, యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్ బీ, ఐరన్, మాంసకృత్తులు, ఒమోగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.
రోజూ ఓ చెంచా నానబెట్టిన అవిసె గింజలను తింటే.. బరువు ఎక్కువ ఉన్నవాళ్లు బరువు తగ్గడంతో పాటు.. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే.. శరీరానికి శక్తి వస్తుంది.
అంజీరా పండు అంటేనే పోషకాలకు కేరాఫ్ అడ్రస్. ఈ పండులో ఉన్న పోషకాలు ఏ పండులో ఉండవు. అంజీరాలో విటమిన్ ఏ, బీ, కాల్షియం, ఐరన్, పీచు, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి.
మార్కెట్ లో డ్రై అంజీరా దొరుకుతుంది. దాన్ని రాత్రి పూట నానబెట్టుకొని పొద్దున్నే తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన ప్రీ రాడికల్స్ తో పోరాడి.. అనారోగ్యాన్ని దరిచేరకుండా చేస్తుంది. అలాగే మెదడు పని తీరు పెరుగుతుంది.
రోజూ రాత్రి పూట ఓ నాలుగైదు బాదం గింజలను నానబెట్టి.. ఉదయాన్నే పొట్టు తీసుకొని తింటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మెదడు చురుకుగా పనిచేయాలంటే మాత్రం ఖచ్చితంగా రోజూ ఓ నాలుగైదు నానబెట్టిన బాదాంపప్పులను తినాల్సిందే.
బాదాంపప్పు వల్ల శరీరంలో ఉన్న చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది. హైబీపీని తగ్గిస్తుంది. అలాగే.. ఎక్కువ బరువు ఉన్నవాళ్లు బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది.
రోజూ రాత్రి గుప్పెడు కిస్ మిస్ ను నానబెట్టి.. ఉదయాన్ని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కిస్ మిస్ లో ఐరన్, యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. కిస్ మిస్ ను ప్రతి రోజూ నానబెట్టి తింటే.. చర్మం కూడా మెరుస్తుంది. బాడీకి కావాల్సిన ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
This website uses cookies.