
Uttam Kumar Reddy : కేసీఆర్, వైయస్ జగన్ దోస్తీ.. నిజస్వరూపం అస్లెంబ్లీ సాక్షిగా బయట పెట్టిన ఉత్తమ్ కుమార్ రెడ్డి..!
Uttam Kumar Reddy : తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఏపీలో ఆయకట్టులో లేని ప్రాజెక్టులు నిర్మాణానికి కేసీఆర్ సహకారం ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేఆర్ఎంబికి సాగునీటి ప్రాజెక్టులను అప్పగించేదీ లేదని తీర్మానించారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీలో కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగాన్ని తెలంగాణ అసెంబ్లీలో ప్రదర్శించారు. తెలంగాణ నుంచి నీరు వదిలితే తప్ప ఏపీకి నీరు వచ్చే పరిస్థితి లేదని, రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ప్రకాశం, గుంటూరు, కృష్ణ , నెల్లూరు, పశ్చిమగోదావరి కి నీరు వచ్చే అవకాశం లేదని, కేసిఆర్ ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీరు తీసుకోవడానికి ఒప్పుకున్నారని వైఎస్ జగన్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను ప్రదర్శించారు.
కేసీఆర్, వైయస్ జగన్ మధ్య ఉన్న సంబంధాల వల్లే తెలంగాణ రాష్ట్రం నష్టపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు అక్కడికి వెళ్లాలన్నారు. ఎన్నికల్లో నవంబర్ 30న పోలింగ్ జరగటానికి ముందు ఒకరోజు రాత్రి ఏపీ ప్రభుత్వం నాగార్జునసాగర్ కుడిగట్టు గేట్లను బలవంతంగా స్వాధీనం చేసుకుందన్నారు. ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి ఆ సమయంలో వైయస్ జగన్ అలా చేశారని అనుమానం అందరికీ ఉందన్నారు. 400 , 500 మంది బలగాలతో 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారన్నారు. ఆ సమయంలో కేసీఆర్ వైయస్ జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయని, కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసి వైయస్ జగన్ ఆంధ్ర పోలీసుల్ని సాగర్ మీదకు పంపారని అనుమానాలు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ ఆరోపించారు.
సాగర్ గేట్లను స్వాధీనం చేసుకునే విషయంలో ఈరోజుకు కేసీఆర్ ఈ విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. డిసెంబర్ 1న కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని తెలంగాణ ఫలితాలు రాకముందే సిఆర్పిఎఫ్ ను పంపి ఏపీ పోలీసులను అక్కడి నుంచి పంపారన్నారు. ఆ సమయంలో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో లేరన్నారు. నాటికి తెలంగాణలో కేసీఆర్ సీఎం గానే ఉన్నారని అప్పుడు కాంగ్రెస్ అధికారంలో లేదన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చేనాటికి తెలంగాణ సీఎంగా కేసీఆర్, ఆయన కార్యదర్శిగా స్మిత సబర్వాల్ సెక్రటరీ హోదాతో పాటు ఇరిగేషన్ అదనపు బాధ్యతలు చూస్తున్నారని చెప్పారు. కేసీఆర్ తరపున సెక్రటరీ స్మిత సబర్వాల్ డిసెంబర్ 1న రాసిన లేఖలో కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించడానికి వేరే రాష్ట్రాలు అంగీకరించాలని గుర్తు చేశారు. 15 జులై 2021 పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగించాలని స్మిత సబర్వాల్ గుర్తు చేశారన్నారు. ప్రాజెక్టులను కేఆర్ ఎంబికి అప్పగించారన్నారు.
Donald Trump : ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన చేసే వ్యాఖ్యలు ప్రపంచ…
Jayaprakash Narayana : ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల పనితీరు మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.…
Revanth Reddy : తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.…
Vijay : కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన వ్యక్తిగత జీవితం మరింత చర్చనీయాంశంగా మారింది.…
Jagadish Reddy : తిరుమలగిరిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై…
Puranapanda Book : హైదరాబాద్, ఫిబ్రవరి 27: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య…
Actor Sivaji : నిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కానీ తాజాగా నటుడు శివాజీ Sivaji చేసిన…
YouTuber Naa Anvesh : తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ…
Uppal : Z.P.H.S గవర్నమెంట్ స్కూల్ ఉప్పల్ లో పదవ తరగతి విద్యార్థుల కోసం ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ కార్యక్రమం…
High Fees : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ పనితీరుపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత…
Vijay-Rashmika : టాలీవుడ్ ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ – నటి రష్మిక దంపతులు ఇవాళ దేశ ప్రధాన మంత్రి…
Rinku Singh Father Death: భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, స్టార్ బ్యాటర్ రింకూ సింగ్ Rinku Singh…
This website uses cookies.