
Dharani Portal : ధరణి పోర్టల్ మల్లారెడ్డి కోసం పెట్టావంటూ కేసీఆర్ పై సంచలన కామెంట్స్ చేసిన వి.హనుమంతరావు..!!
Dharani Portal : బీఆర్ఎస్ ప్రభుత్వం పై కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అందర్నీ మోసం చేసిందని ఆయన అన్నారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిందని, కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాట తప్పారని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని అంటున్నారు. ఒకసారి కర్ణాటక వెళ్లి చూడండి అని వి.హనుమంతరావు పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని వ్యాఖ్యలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అది ఏమైందని కిషన్ రెడ్డిని వి.హనుమంతరావు ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అని హామీలు పూర్తి చేసాం. ఇప్పటికే రెండు హామీలు అమలు చేసాం అని వి. హనుమంతరావు స్పష్టం చేశారు.
మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కాంగ్రెస్ కల్చర్ అని హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ పేదలకు భూములు ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని తీసుకుంది. కేవలం ధనవంతులకు మాత్రమే బీఆర్ఎస్ న్యాయం చేసిందని అన్నారు. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం మూడెకరాల భూమి అన్నారు. కానీ ఇవ్వలేదు. ధరణి పోర్టల్ ద్వారా భూములు లాగేశారు. దానిని రద్దు చేయాలి. అలాగే రెవెన్యూ శాఖలో తప్పులు జరిగాయి. ప్రభుత్వం పడిపోతుందనే స్టేట్మెంట్పై బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు కామెంట్ చేయవద్దు. ప్రజలు కాంగ్రెస్ను నమ్మారు కాబట్టే సోనియాగాంధీ తెలంగాణ వచ్చారు అని హనుమంతరావు స్పష్టం చేశారు.
ఆ ధరణి పోర్టల్ ద్వారా ధనవంతులు బాగుపడ్డారు. పేద ప్రజలకు అన్యాయం జరిగిందని ఆ ధరణి పోర్టల్ ని రద్దు చేయాలని హనుమంతరావు తెలిపారు. కేసిఆర్ ప్రభుత్వం ప్రజలను అన్యాయం చేసిందని వారి భూములు లాగేసుకుని ఆస్తులన్నీ వెనకేసుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో ఇంటికొక ఉద్యోగం ఇస్తామని ఒక్కరికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ప్రజలను ఇబ్బంది పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం అందుకే ఓడిపోయిందని, ప్రజల మనసులను గెలుచుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కావాలని కోరుకున్నారు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆయన తెలిపారు.
YSRCP: గంగాధర నెల్లూరు రాజకీయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా వైసీపీలో కృపా లక్ష్మి YCP…
Ambati Rambabu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కుల సమీకరణాలు ఎప్పుడూ వేడి పుట్టిస్తూనే ఉంటాయి. తాజాగా ఒక టీవీ చర్చా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సరఫరాలో తలెత్తిన ఇబ్బందులు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.…
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
This website uses cookies.