Venu Swamy : ఇండియా- పాక్ యుద్ధంపై వేణు స్వామి జోస్యం.. వారు చనిపోతారంటూ.. వీడియో !
ప్రధానాంశాలు:
Venu Swamy : ఇండియా- పాక్ యుద్ధంపై వేణు స్వామి జోస్యం.. వారు చనిపోతారంటూ..!
Venu Swamy : పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సిందూర్ పేరిట పాక గుండెల్లో గుబులు పుట్టిస్తోంది భారత్ లోని కొన్ని ముఖ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడులకు దిగుతోంది. అయితే భారత సాయుధ దళాలు పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పి కొడుతున్నాయి. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య యుద్ధ పరిస్థితులపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి స్పందించారు. భారత్ – పాకిస్తాన్ యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పాను ఓ పాత వీడియోని గుర్తు చేశారు.

Venu Swamy : ఇండియా- పాక్ యుద్ధంపై వేణు స్వామి జోస్యం.. వారు చనిపోతారంటూ.. వీడియో !
Venu Swamy పాత వీడియోతో..
యుద్ధం కారణంగా దేశం 80% నాశనం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారని జోస్యం చెప్పారు. ఈ యుద్ధంలో పాక్ ప్రధాని కూడా చనిపోయే అవకాశం ఉందని అన్నారు. అంతేకాదు ప్రధాని నరేంద్ర మోడీకి దోషం ఉందని చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
దీనిని చూసిన వారందరూ భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో తాను షేర్ చేస్తోన్న వీడియోలకు కామెంట్ సెక్షన్ ని ఆఫ్ చేస్తున్నారు వేణు స్వామి. ప్రస్తుతం ఈ వీడియోకు కూడా కామెంట్ సెక్షన్ ను ఆపేశారు. కాగా నాగ చైతన్య, సమంతలు విడిపోతారని చెప్పి ఫేమస్ అయ్యారు వేణు స్వామి. ఇక అప్పటి నుండి సెలబ్రిటీల జాతకాలు చెబుతూ హాట్ టాపిక్ అవుతున్నారు.
భారత్-పాక్ యుద్ధంపై వేణుస్వామి జోస్యం
యుద్ధం జరుగుతుందని తాను ముందే చెప్పానంటూ ఓ పాత వీడియోని గుర్తు చేసిన వేణుస్వామి
యుద్ధంతో 80 శాతం నాశనం అవుతుందని వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా పెద్ద నాయకులు, నటులు మరణిస్తారంటూ జోస్యం#IndiaPakistanWar #VenuSwami pic.twitter.com/OKCKoWj0OO
— BIG TV Breaking News (@bigtvtelugu) May 10, 2025