
Biryani : పెళ్లిరోజు అని హోటల్కి వెళ్తె.. బిర్యానీ బిల్లు వెయ్యి.. ఆస్పత్రి బిల్లు లక్ష..!
Biryani : ప్రస్తుత కాలంలో చాలామంది వివిధ రెస్టారెంట్స్ లో ఫుడ్ లను ఎక్కువగా ఆస్వాదిస్తున్నారు. కానీ వాటిని తినడం వలన కలిగే అనర్ధాలు ఏంటో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటన స్పష్టంగా తెలియజేస్తోంది. అయితే వాస్తవానికి ప్రస్తుతం ఫుడ్ బిజినెస్ అనేది విస్తృతంగా వ్యాపిస్తూ వస్తోంది. దీంతో చాలామంది రోడ్ సైడ్ కూడా వివిధ రకాల ఫుడ్స్ అమ్ముతూ వేలలో సంపాదిస్తున్నారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ కొందరు సరైన నాణ్యతతో ఆహారాన్ని తయారు చేయకపోవడం వలన వాటిని తిన్నవారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పడం లేదు. దీంతో తిన్న దానికి కట్టే బిల్లు వేలలో ఉన్నప్పటికీ ఆసుపత్రిలో కట్టే బిల్లు మాత్రం లక్షల్లో అవుతుంది. అలాంటి సంఘటన తాజాగా షాద్ నగర్ లోని అప్పారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది.
పెళ్లిరోజు సందర్భంగా ఓ కుటుంబం సమీప ప్రాంతంలో గల రెస్టారెంట్ కి వచ్చి అక్కడ విందు ఆరగించి వెళ్ళిన తర్వాత అస్వస్థకు గురయ్యారు. దీంతో వారు రెస్టారెంట్ లో చేసిన బిల్లు వేయి అయినప్పటికీ ఆసుపత్రిలో మాత్రం లక్షల ఖర్చు అయింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే… షాద్ నగర్ అప్పారెడ్డి గూడ గ్రామానికి చెందిన కావాలి నరేందర్ మంగమ్మ అనే దంపతులు వారి పెళ్లిరోజు సందర్భంగా తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈనెల 22వ తేదీన షాద్ నగర్ లోని సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో బిర్యానీ తినేందుకు వచ్చారు. ఇక ఆ రెస్టారెంట్ లో మండి బిర్యానీ తిన్నారు. ఇప్పటివరకు బాగానే ఉంది కానీ తిరిగి ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులందరికీ వాంతులు విరోచనాలు అవ్వడం మొదలయ్యాయి. దీంతో వారి కుటుంబ సభ్యులు అంతా శంషాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.
Biryani : పెళ్లిరోజు అని హోటల్కి వెళ్తె.. బిర్యానీ బిల్లు వెయ్యి.. ఆస్పత్రి బిల్లు లక్ష..!
ఇక వీరిలో నరేందర్ కు రక్తపు వాంతులు విరోచనాలు అవ్వడంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా తీవ్ర చర్చానియాంశంగా మారింది. రెస్టారెంట్ లో వారిచేసిన బిల్లు వేలలో ఉంటే ఆసుపత్రిలో మాత్రం లక్షల ఖర్చు అవుతుంది. ఇక ఆసుపత్రిలో చికిత్స చేసిన వైద్యులు సైతం వారు తీసుకున్న ఆహారం వలన అస్వస్థకు గురయ్యారని చెబుతున్నారు. దీంతో స్థానికులు అంతా సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకోకుండా నాసిరకమైన ఆహారాన్ని తయారు చేయడం వలన ఈ విధంగా జరిగిందని ఆరోపిస్తున్నారు. తక్షణమే రెస్టారెంట్ ని మూసివేయాల్సిందిగా అధికారులను కోరుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Sweet Lime Juice : వేసవి కాలం మొదలైతేనే ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, చెమటల ద్వారా…
Chanakya Niti : ప్రాచీన భారతదేశానికి చెందిన మహా తత్వవేత్త, ఆర్థిక శాస్త్రజ్ఞుడు అయిన చాణక్యుడు మన జీవిత విధానంపై…
Virosh Jodi : తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ –…
Vivo X200 Pro : ప్రీమియం ఫీచర్లు, సూపర్ కెమెరా క్వాలిటీ, బలమైన పనితీరు అన్నీ కలిపి స్మార్ట్ఫోన్ను తక్కువ…
Vijay : తమిళ సినీ నటుడు, టీవీకే (తమిళగా వెట్రి కళగం) అధినేత విజయ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన…
TTD Jobs : నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు శుభవార్త. తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ) అనుబంధ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న…
గల్ఫ్ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రపంచ దేశాలన్నింటికీ ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయిల్ మధ్య…
విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని మరియు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు…
తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒక పెద్ద మార్పు గురించి జోరుగా చర్చ జరుగుతోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాల రాజకీయ…
PMSBY : ఈ రోజుల్లో ఒక కప్పు టీ తాగాలన్నా కనీసం 20 రూపాయలు ఖర్చవుతోంది. అయితే అదే 20…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ నడుస్తోంది, అదే జగన్ అరెస్ట్ వ్యవహారం. గత ఐదేళ్ల పాలనలో…
womens : మహిళల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని…
This website uses cookies.