New TPCC Chief : టీపీసీసీ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

New TPCC Chief : టీపీసీసీ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది..?

New TPCC Chief  : రాష్ట్రం లో కాంగ్రెస్ అధికరంలో ఉంటే సీఎం తో పాటుగా పీసీసీ అధ్యక్షుడికి కూడా అదే రేంజ్ గౌరం అందుతుంది. ఇప్పుడనే కాదు అది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న పద్ధతి. వైఎస్సార్ సీఎం గా ఉన్నప్పుడు డీఎస్, కేశవరావు. కిరణ్ కుమార్ రెడి సీఎం గా ఉన్న టైం లో బొత్సా సత్యనారాయణ లాంటి వారు పీసీసీ చీఫ్ లుగా ఉన్నారు. ఐతే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లుగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :16 August 2024,9:00 pm

New TPCC Chief  : రాష్ట్రం లో కాంగ్రెస్ అధికరంలో ఉంటే సీఎం తో పాటుగా పీసీసీ అధ్యక్షుడికి కూడా అదే రేంజ్ గౌరం అందుతుంది. ఇప్పుడనే కాదు అది ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న పద్ధతి. వైఎస్సార్ సీఎం గా ఉన్నప్పుడు డీఎస్, కేశవరావు. కిరణ్ కుమార్ రెడి సీఎం గా ఉన్న టైం లో బొత్సా సత్యనారాయణ లాంటి వారు పీసీసీ చీఫ్ లుగా ఉన్నారు. ఐతే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్న కాంగ్రెస్ ఆ టైం లో టీపీసీసీలుగా ఉత్తం కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి లను ఉంచింది. ఐతే ఈ సెంటిమెంట్ వల్ల నేటి టీపీసీసీ చీఫే రేపటి సీఎం అన్న అభిప్రాయం కాంగ్రెస్ లో ఏర్పడింది. ఐతే రేవంత్ టీపీసీసీ చీఫ్ పదవి కాలం పూర్తి కాగా నెక్స్ట్ పీసీసీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారు అన్నది సస్పెన్స్ గా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం దీని మీద తీవ్ర మంతనాలు చేస్తుంది. చర్చలు జరుగుతున్నా కూడా వాటికి ఒక కొలిక్కి చేరట్లేదని తెలుస్తుంది. ఆషాడము వచ్చింది కాబట్టి నెల రోజుల పాటు ఆ ఊసే ఎత్తలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఈ శ్రావణ మాసం వచ్చింది. తెలంగాణా కాంగ్రెస్ కొత్త సారధి ఎంపిక మళ్లీ తెర మీదకు వచ్చింది.

New TPCC Chief  ఢిల్లీకి రేవంత్.. ఈ పని మీదేనా..

గురువారం ఖమ్మం సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత ఢిల్లీ వెళ్లార్. అధిష్టానంతో చర్చలు జరిపి మంత్రి వర్గ విస్తరణ నామినేటెడ్ పదవుల భతీపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు టీపీసీ అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్నది కూడా ఈ చర్చల్లో నిర్ణయిస్తారని తెఉస్తుంది. రాష్ట్రంలో పరిస్థితులను రేవంత్ వారా ఒక అభిప్రాయానికి వచ్చేలా అధిష్టానం ఆలోచిస్తుంది.

New TPCC Chief టీపీసీసీ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది

New TPCC Chief : టీపీసీసీ ఎంపిక కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది..?

ఈసారి అధ్యక్ష పదవికి సామాజిక సమీకరణాలు ప్రాధాన్యా ఇచ్చేలా ఉన్నారు. నిన్నటిదాకా మహేష్ కుమార్ గౌడ్ కు ఖాయమని అనుకోగా.. ఈలోగా మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నారని తెలుస్తుంది. మరోపక్క ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కూడా అధ్యక్ష పదవికి గట్టి పోటీ ఇస్తున్నారని తెలుస్తుంది. వీళ్లే కాదు మధు యాస్కీ గౌడ్ కూడా రేసులో ఉన్నారని తెలుస్తుంది. అధ్యక్ష ఎంపిక నామినేటెడ్ పోస్టుల గురించి అధీష్టానంతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకునేందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది