why there are clashes in telangana bjp
Telangana BJP : తెలంగాణ బీజేపీ పరిస్థితి గురించి ఇప్పుడు తలుచుకుంటేనే జనాలకు చిరాకేస్తోంది. మొన్నటి దాకా బీజేపీ పార్టీని చూసి అదిగో పార్టీ అంటే అలా ఉండాలి.. ఇలా ఉండాలి అని అందరూ గొప్పలు చెప్పుకున్నారు. కానీ.. ఇప్పుడు మాత్రం బీజేపీ పార్టీని చూస్తేనే చిరాకేస్తుంది జనాలకు. అసలు ఏంటి ఆ అంతర్గత విభేదాలు. ఏంటి ఆ గొడవలు, ఏంటి ఆ కలహాలు. వాళ్లలో వాళ్లే కొట్టుకునే స్థాయికి చేరుకున్నారు. చివరకు ప్రెస్ మీట్ పెట్టి మరీ.. సొంత పార్టీ నేతలపైనే ఆరోపణలు చేసుకునే వరకు వెళ్లారంటే ఇక ఆ పార్టీ పరిస్థితి ఏంటో చెప్పుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే ఇదే సమయంలో బీజేపీ హైకమాండ్ కూడా తెలంగాణలో బీజేపీ నాయకత్వంలో పలు మార్పులు చేసింది. బండి సంజయ్ ని తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డిని నియమించింది. మరి.. కేంద్ర మంత్రి పదవి కిషన్ రెడ్డికి ఉందా.. పోయిందా లేక రెండు పదవులు ఒకేసారి నిర్వర్తిస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయితే.. ఆయన ఢిల్లీలోనే ఉన్న కేంద్ర కేబినేట్ భేటీకి ఇటీవల హాజరు కాలేదు. దాన్ని బట్టి చూస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి పోయినట్టే అని అనుకోవాలి.ఇక.. బండి సంజయ్ పరిస్థితి ఏంటో తెలియడం లేదు. ఆయన్ను బీజేపీ చీఫ్ స్థానం నుంచి తొలగించారు సరే.. మరి ఆయనకు ఏ పదవి ఇస్తారు అనేదానిపై క్లారిటీ లేదు. కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే వార్తలు వస్తున్నాయి కానీ.. వాటిలో నిజం ఉందా లేదా అనేది తెలియదు. ఇక.. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు.. బీజేపీలో చోటు చేసుకునే మార్పులను ముందే పసిగట్టి తనకు కూడా ఏదైనా పదవి ఇవ్వాలని మీడియా ముందే చెప్పేశారు. పదేళ్ల నుంచి పార్టీలో నమ్మకంగా పని చేశానని..
why there are clashes in telangana bjp
దుబ్బాకలోనూ గెలిచి చూపించానని అంటూ తనకు కూడా పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్నే నేరుగా డిమాండ్ చేసినంత పని చేశారు. కానీ.. అధిష్ఠానం మాత్రం ఈటల రాజేందర్ కు కీలక పదవి అప్పగించింది. అలాగే.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా పదవి ఇచ్చింది కానీ.. రఘునందన్ రావుకు, విజయశాంతి, జితేందర్ రెడ్డి, వివేక్ లకు మొండి చేయి చూపింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కంటే కూడా ఇక్కడే ఎక్కువ వర్గాలుగా విడిపోయి నేతలు తమ అసంతృప్తులను వెల్లగక్కుతున్నారు.
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్లో హీరోయిన్గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
This website uses cookies.