
మరణం కూడా వేరు చేయలేని పవిత్ర బంధం.. భర్త మరణించిన కొన్ని గంటల్లోనే భార్య మృతి..!
ఈ ప్రపంచంలో భార్యాభర్తలకు మించిన బంధం మరొకటి ఉండదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అన్ని బంధాల కంటే కూడా భార్య భర్తల బంధం చాలా బలంగా శాశ్వతంగా ఉంటుంది. ఇక ఈ భార్యాభర్తల బంధంలో ఒకరికోసం ఒకరు బతకడం జీవితం. ఇక అందుకు సజీవ సాక్ష్యం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు చెందిన వృద్ధ దంపతులు అని చెప్పాలి. ఎందుకంటే ఈ భార్యాభర్తల బంధాన్ని చివరకు చావు కూడా వేరు చేయలేకపోయింది.అందుకే ఆత్మీయ దంపతులకు ఆ జంట నిదర్శనం అని చెప్పాలి. వృద్ధాప్యంలో కూడా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవనం సాగించారు. ఇక ఈ క్రమంలోనే మరణంలో కూడా వారి బంధం వేరుపడలేదు.ఎందుకంటే తన భర్త అనారోగ్యంతో చనిపోతే అదే రోజు భార్య బెంగతో ప్రాణాలు విడిచింది… పూర్తి వివరాల్లోకెళ్తే…
భార్యాభర్తల బంధం అంటే పాలు నీళ్లలా కలిసిపోవాలని మన పెద్దలు అంటూ ఉంటారు.ఎందుకంటే వేర్వేరుగా ఉన్నంతవరకే వాటిని పాలు, నీళ్లు అని చెప్పగలుగుతాం కానీ ఒక్కసారి ఆ రెండు కలిస్తే మాత్రం పాల ను నీళ్ల ను వేరు చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. అదేవిధంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలతో కూడిన ప్రేమ మొదలై భార్య భర్తల బంధం ఏర్పడిన తర్వాత ఆ దంపతులను వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదని చెప్పాలి. ఇక అలాంటిదే భద్రాది కొత్తగూడెం జిల్లాకు చెందిన ఈ వృద్ధ భార్యాభర్తల జీవనం అని చెప్పాలి.ఎందుకంటే మరణం లో కూడా వారి బంధం వేరుకాలేదు. అయితే భర్త అనారోగ్యంతో చనిపోవడంతో అదే రోజు భార్య తన భర్తపై బెంగ పెట్టుకొని ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన పినపాక మండలంలో చోటుచేసుకుంది. దీంతో ఆదర్శ దంపతులు హఠాన్మరణం అందర్నీ కంటతడి పెట్టించింది అని చెప్పాలి.
అయితే పినపాక మాజీ సర్పంచ్ సుంకరి రాములు గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారట.ఈ నేపథ్యంలోనే సోమవారం ఆరోగ్యం క్షీణించి సుంకరి రాములు మృతి చెందడం జరిగింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆమె భార్య నర్సమ్మ భర్త లేకుండా ఎలా బతకగలను అనుకుందో ఏమో కానీ అదే రోజు సాయంత్రం తనువు చాలించింది. అయితే తల్లిదండ్రులు ఇద్దరు ఒకేరోజు మరణించడంతో వారి పిల్లలు విలపించిన తీరు గ్రామస్తులను తీవ్ర కంటతడి పెట్టించింది.దీంతో రాములు నరసమ్మ దంపతులకు కలిపి అంతక్రియ కార్యక్రమాలు కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఇక ఈ ఆదర్శ దంపతుల ఆంతిమ యాత్రలో గ్రామస్తులంతా పాల్గొని ఘనంగా నివాళి అర్పించారు.అయితే 80 ఏళ్ల వయసులో కూడా ఒకరిపై ఒకరు పెట్టుకున్న ప్రేమతో చివరికి ఒకేసారి మరణించి ఒకటయ్యారు. తనువు వేరైనా తాము ఒకటే అన్నట్లుగా ప్రపంచానికి ఈ ఆదర్శ దంపతులు చూపించారు అని చెప్పాలి.మరి వీరి పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి.
Petrol : భారత్లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…
Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…
Vijay and Trisha Marriage : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…
Hair : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…
Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…
High-Protein Breakfast : ఉదయాన్నే తీసుకునే బ్రేక్ఫాస్ట్ మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. చాలామంది ఉదయం అల్పాహారాన్ని స్కిప్…
This website uses cookies.