
Chandrababu
Chandrababu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశాడు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా, వ్యూహకర్తగా, అపర చాణక్యుడిగా పేరుంది. కానీ, ఆ తర్వాత కాలంలో ఆయన అధినాయకత్వంలోని రాజకీయ పార్టీ టీడీపీకి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. విభజిత ఏపీలో ఒకసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు అయిపోయారు. టీడీపీ 2019 సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయింది. ఈ క్రమంలోనే టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
Chandrababu
కానీ ఆ తర్వాత కాలంలో ఆ రెండు పార్టీలతో పొత్తు నుంచి టీడీపీ దూరమయింది. అయితే, ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్తో చర్చలు జరిపి రాష్ట్రవ్యాప్త పొత్తుకు ఆలోచనలు చేస్తున్నారట చంద్రబాబు. తద్వారా టీడీపీ పార్టీపై కమ్మ సామాజిక వర్గ ముద్రను తొలగించొచ్చనేది టీడీపీ అధినేత భావన. ఈ క్రమంలోనే కాపు, కమ్మ కాంబినేషన్లో పొలిటికల్గా టీడీపీ బాగా స్ట్రాంగ్ అయి మళ్లీ అధికారంలోకి రావచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీపై విమర్శలు చేయొద్దని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పట్టాభి ఎపిసోడ్ తర్వాత ఈ నిర్ణయాలను చంద్రబాబు తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో జాగ్రత్తలు వహించాలని సూచించినట్లు వినికిడి. మొత్తంగా కమ్మ సామాజికి వర్గానికి చెందిన నేతలను కొంత కాలం పాటు పక్కనబెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. మీడియా ఎదుటకు వచ్చే నేతల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు, ఉమా మహేశ్వర్ రావు, అశోక్ గజపతిరాజు, అమర్నాథ్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, రామకృష్ణుడు యనమల, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య మాత్రమే ఉండాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు సూచించినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చూడాలి మరి… చంద్రబాబు ప్లాన్స్ ఏ మేరకు వర్కవుట్ అవుతాయో..
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన లండన్ ప్రయాణం అవుతుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో…
Telangana BJP : తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోలేకపోవడానికి ప్రధాన కారణం గతంలో జరిగిన నియోజకవర్గాల…
Mahasena Rajesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే పేరు మారుమోగిపోతోంది. అదే మహాసేన రాజేష్. సోషల్ మీడియాలో తనదైన…
Modi : మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోవడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. ఎన్డీఏ ప్రభుత్వం…
Viral video : తెలుగు బుల్లితెర ప్రపంచంలో ప్రేక్షకులను అలరించేందుకు ఛానెళ్లు కొత్త కాన్సెప్ట్లతో ముందుకు వస్తున్నాయి. కామెడీ, కుకింగ్,…
Dwakra Group : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్వాక్రా మహిళల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడానికి పలు సంక్షేమ పథకాలను అమలు…
Red Banana : అరటిపండు అనేది ప్రతి ఇంట్లో కనిపించే సాధారణ పండు అయినప్పటికీ దాని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణంగా…
Fast Eating : నేటి వేగవంతమైన జీవనశైలిలో మనుషులు ప్రతి పనినీ త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ తొందరలో…
Nails : ఉపిరితిత్తుల క్యాన్సర్ను సాధారణంగా దగ్గు, ఛాతీ నొప్పి, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా గుర్తిస్తారని మనం…
Pakistan : పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం ఎలా తయారైందంటే.. బయటకి మాత్రం గొప్పలు చెప్పుకుంటూ లోపల మాత్రం చిల్లి గవ్వ…
Mahila Reservation Bill : మూడింట రెండొంతుల మెజారిటీ దక్కకపోవడంతో బిల్లు వీగిపోవడం Lok Sabha : లోక్సభలో కేంద్ర…
Iran Usa : పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఒక షాకింగ్ నివేదిక బయటకు వచ్చింది. ఇరాన్ మరియు…
This website uses cookies.