Chandrababu : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేశాడు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడిగా, వ్యూహకర్తగా, అపర చాణక్యుడిగా పేరుంది. కానీ, ఆ తర్వాత కాలంలో ఆయన అధినాయకత్వంలోని రాజకీయ పార్టీ టీడీపీకి ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదురైంది. విభజిత ఏపీలో ఒకసారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు అయిపోయారు. టీడీపీ 2019 సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయింది. ఈ క్రమంలోనే టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కానీ ఆ తర్వాత కాలంలో ఆ రెండు పార్టీలతో పొత్తు నుంచి టీడీపీ దూరమయింది. అయితే, ఇటీవల కాలంలో మున్సిపల్ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీ, జనసేన పొత్తు కుదిరింది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్తో చర్చలు జరిపి రాష్ట్రవ్యాప్త పొత్తుకు ఆలోచనలు చేస్తున్నారట చంద్రబాబు. తద్వారా టీడీపీ పార్టీపై కమ్మ సామాజిక వర్గ ముద్రను తొలగించొచ్చనేది టీడీపీ అధినేత భావన. ఈ క్రమంలోనే కాపు, కమ్మ కాంబినేషన్లో పొలిటికల్గా టీడీపీ బాగా స్ట్రాంగ్ అయి మళ్లీ అధికారంలోకి రావచ్చని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు వైసీపీపై విమర్శలు చేయొద్దని చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. పట్టాభి ఎపిసోడ్ తర్వాత ఈ నిర్ణయాలను చంద్రబాబు తీసుకున్నట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసే క్రమంలో జాగ్రత్తలు వహించాలని సూచించినట్లు వినికిడి. మొత్తంగా కమ్మ సామాజికి వర్గానికి చెందిన నేతలను కొంత కాలం పాటు పక్కనబెట్టాలని చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. మీడియా ఎదుటకు వచ్చే నేతల్లో కింజారపు రామ్మోహన్ నాయుడు, ఉమా మహేశ్వర్ రావు, అశోక్ గజపతిరాజు, అమర్నాథ్ రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, రామకృష్ణుడు యనమల, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, వర్ల రామయ్య మాత్రమే ఉండాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు సూచించినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. చూడాలి మరి… చంద్రబాబు ప్లాన్స్ ఏ మేరకు వర్కవుట్ అవుతాయో..
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.