chandrababu complaint to president on ycp govt
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ ఫైర్ అవుతోంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ తాత రాజారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిపిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ‘ఏపీ ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరు’ పేరిట 36 గంటల నిరసన దీక్ష చేశారు. అనంతరం ఏపీలో ఉన్న పరిస్థితులు వివరించేందుకుగాను ఢిల్లీకి చవ్చారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి ఏపీలోని పరిస్థితులపై వివరించారు.
chandrababu complaint to president on ycp govt
అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 356 అమలు చేయాలని, ఏపీలో అరాచక పాలన కొనసాగుతున్నదని, 356 అమలు చేసి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. టీడీపీ నేతల బృందంతో కలిసి చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్రపతిని కలిశారు. టీడీపీ నాయకులను అధికార వైసీపీ ప్రభుత్వం శారీరకంగా, మానసికంగా రాజకీయంగా క్షోభ పెడుతూ ఆర్థికమూలాలపై దెబ్బతీస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు. ఇకపోతే తమ సమస్యలన్నిటినీ రాష్ట్రపతి విన్నారని, న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో అరాచకాలు పెరిగిపోతే దేశ సమగ్రతకే ముప్పు వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏపీలో టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరామని వివరించారు.
Chandrababu
చంద్రబాబు.అరాచకాలకు కేరాఫ్గా ఏపీ కాబోతుందేమోనని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఏపీ డీజీపీపైన పలు ఆరోపణలు చేశారు. పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రితో కలిసి టీడీపీ నేతలను టార్చర్ చేస్తుందని ఫైర్ అయ్యారు. తన ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ హిస్టరీలో ఇటువంటి పాలిటిక్స్ చూడలేదని, గతంలో రాజారెడ్డి ఇలాగే చేసేవాడని, ఇప్పుడు ఆయన మనవడు జగన్ అలా చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రధాన మంత్రి మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుస్తామని, ఇప్పటికే వారిరువురి అపాయింట్మెంట్స్ అడిగామని మీడియాకు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.