Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అట్టుడుకుతున్నాయి. అధికార వైసీపీపై ప్రతిపక్ష టీడీపీ ఫైర్ అవుతోంది. ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు జగన్ తాత రాజారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిపిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ‘ఏపీ ప్రభుత్వం ఉగ్రవాదంపై పోరు’ పేరిట 36 గంటల నిరసన దీక్ష చేశారు. అనంతరం ఏపీలో ఉన్న పరిస్థితులు వివరించేందుకుగాను ఢిల్లీకి చవ్చారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసి ఏపీలోని పరిస్థితులపై వివరించారు.
అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆర్టికల్ 356 అమలు చేయాలని, ఏపీలో అరాచక పాలన కొనసాగుతున్నదని, 356 అమలు చేసి రాష్ట్రపతి పాలన తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. టీడీపీ నేతల బృందంతో కలిసి చంద్రబాబు నాయుడు సోమవారం రాష్ట్రపతిని కలిశారు. టీడీపీ నాయకులను అధికార వైసీపీ ప్రభుత్వం శారీరకంగా, మానసికంగా రాజకీయంగా క్షోభ పెడుతూ ఆర్థికమూలాలపై దెబ్బతీస్తున్నదని చంద్రబాబు ఆరోపించారు. ఇకపోతే తమ సమస్యలన్నిటినీ రాష్ట్రపతి విన్నారని, న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలో అరాచకాలు పెరిగిపోతే దేశ సమగ్రతకే ముప్పు వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఏపీలో టీడీపీ ఆఫీసులపై జరిగిన దాడులపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరామని వివరించారు.
చంద్రబాబు.అరాచకాలకు కేరాఫ్గా ఏపీ కాబోతుందేమోనని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఏపీ డీజీపీపైన పలు ఆరోపణలు చేశారు. పోలీసు వ్యవస్థ ముఖ్యమంత్రితో కలిసి టీడీపీ నేతలను టార్చర్ చేస్తుందని ఫైర్ అయ్యారు. తన ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ హిస్టరీలో ఇటువంటి పాలిటిక్స్ చూడలేదని, గతంలో రాజారెడ్డి ఇలాగే చేసేవాడని, ఇప్పుడు ఆయన మనవడు జగన్ అలా చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో ప్రధాన మంత్రి మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాను కలుస్తామని, ఇప్పటికే వారిరువురి అపాయింట్మెంట్స్ అడిగామని మీడియాకు చెప్పారు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.