Home » Andhra Pradesh » Chandrababu New Plan For Strengthening Tdp
andhra pradesh

Chandrababu : ఈసారి టికెట్ల విషయంలో చంద్రబాబు సరికొత్త వ్యూహం.. టికెట్లన్నీ వాళ్లకేనట?

Authored By
mallesh
The Telugu News | Published on: October 17, 2021, 2:10 pm
Advertisement

Chandrababu : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ నేడు ఏపీలో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. తెలంగాణలో టీడీపీ అనేది దాదాపుగా లేకుండా పోయింది. నేతలు, కార్యకర్తలు దాదాపుగా వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే తెలుగు దేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకుగాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు వ్యూహాలు రచిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఏపీలోని వాస్తవ పరిస్థితులపై అంచనా వేసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా ఏపీలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకుగాను మాస్టర్ ప్లాన్ వేశారు.టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి డిఫరెంట్ ప్లాన్ వేసినట్లు సమాచారం.

Advertisement

chandrababu

అందులో భాగంగానే ఏపీలోని నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను రెండేళ్ల ముందరే పరిచయం చేసి, ప్రచారం చేయాలాని భావిస్తున్నారట. అయితే, ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వకపోయినప్పటికీ పార్టీలో కష్టపడి పని చేస్తున్న వారికి టికెట్లు దాదాపుగా ఖరారు అవుతాయని చంద్రబాబు సంకేతాలు పంపినట్లు టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇందుకుగాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ పార్టీ మెయిన్ ఆఫీసులో నియోజకవర్గాల వారిగా నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నారట. వాటి ఆధారంగా నియోజకవర్గ ఇన్‌చార్జులను నియమించి, వారికే టికెట్ ఇవ్వబోతున్నట్లు సమచారం. అయితే, ఇన్‌చార్జులుగా ఉన్న వారందరికీ డైరెక్ట్‌గా టికెట్లు ఇస్తారనుకుంటే సరి కాదు.

Advertisement

Chandrababu : రెండేళ్ల ముందు నుంచే ప్రచారం..

tdp

వారు పార్టీ కోసం, ప్రజల కోసం జరిపే కార్యక్రమాలు, పని తీరు ఆధారంగా టికెట్లు ఇస్తారట టీడీపీ చీఫ్. గతంలో మాదిరిగా అభ్యర్థుల ఎంపిక కోసం ఉండే స్క్రీనింగ్ కమిటీలు ఈ సారి ఉండబోవని ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారట. నియోజకవర్గ ఇన్‌చార్జుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి, పని తీరు సరిగా లేకపోతే వారిని ఆ ఇన్‌చార్జి పదవి నుంచి తొలగిస్తామని చంద్రబాబు స్పష్టంగా పేర్కొన్నట్లు టీడీపీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. మొత్తంగా టీడీపీని మళ్లీ ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయ అధికారం సాధించాలని, అందుకుగాను రెండేళ్ల ముందు నుంచే పకడ్బందీగా పార్టీ కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి