
Ys jagan
YS Jagan :2019 సాధారణ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభంజనమే సృష్టించిన సంగతి అందరికీ విదితమే. భారీ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వచ్చారు. ఈ క్రమంలోనే జగన్ మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే, జగన్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరితేనే ప్రజలకు ఆయనకు మళ్లీ అవకాశం ఇస్తారని పలువురు అంటున్నారు. అయితే, జగన్ పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది కల్లా పూర్తి చేస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏపీ సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. మెఘా ఇంజినీరింగ్ కంపెనీపైన జగన్ నమ్మకం పెట్టుకున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Ys jagan
ప్రాజెక్టను సత్వరమే పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టును జగన్ ఫాదర్ దివంగత వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించగా, అప్పటి నుంచి పనులు సాగు..తూనే ఉన్నాయి. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో 70 శాతం పనులు పూర్తి చేసినట్లు ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. అయితే, అవి ఉట్టి మాటలేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలో పలువురు నేతలు ఇంకో అడుగు ముందుకేసి పోలవరం పూర్తి చేయకపోవడం వల్లే చంద్రబాబుకు ఈ గతి పట్టిందని, ఘోర పరాజయం చెందారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ముందున్న అతి పెద్ద టాస్క్ పోలవరం అని తెలుస్తోంది. 2022 నాటికి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తానని జగన్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడా వానాకాలం నాటికి నీళ్లు అందించే విషయమై కూడా జగన్ హామీ ఇచ్చారు. పనులు చాలా వేగవంతంగా జరిగితే తప్ప అప్పటి వరకు నీళ్లు అందుతాయనేది కొందరి అభిప్రాయం.
Ysrcp
పోలవరం ప్రాజెక్టు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయో క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అధికారుల పరిశీలనతో పాటు వైసీపీ నేతలు కూడా చూడాల్సి ఉంటుందని మరి కొందరు చెప్తున్నారు. కేంద్రప్రభుత్వం నిధులు కూడా అవసరం కాగా వాటి కోసం ఏపీ రాష్ట్రసర్కారు స్పెషల్ అధికారుల బృందాలనూ నియమించింది. వారూ పోలవరం ప్రాజెక్టు ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఢిల్లీలో వివరణ ఇస్తున్నారు కూడా. మొత్తంగా పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి జగన్ పూర్తి చేయగలడా? లేదా ? అనేది ప్రజెంట్ హాట్ టాపిక్గా ఉంది.
Business : ప్రపంచంలో ఎన్నో రకాల వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది ఎంచుకునే మార్గాలు సాధారణ ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అలాంటి…
WhatsApp : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ వినియోగించే WhatsApp ఇప్పుడు కొత్త మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటివరకు పూర్తిగా…
Gold : ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్కు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది. స్మార్ట్ఫోన్ యాప్స్ అందుబాటులోకి రావడంతో బంగారాన్ని కొనుగోలు…
Mangoes : వేసవి కాలం అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మామిడి పండు. సహజంగా తీపి రుచితో ఆకట్టుకునే ఈ…
Tea : ఉదయం నిద్రలేవగానే వేడి వేడి టీ కప్పు లేకపోతే చాలా మందికి రోజు మొదలవదనే చెప్పాలి. టీ…
Millet Breakfast : ఉదయం లేవగానే కొందరికి అలసట, నీరసం అనిపించడం సాధారణ విషయం. రాత్రి నిద్ర బాగా పడినా…
BPCL : ప్రభుత్వ రంగంలో స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు మంచి శుభవార్త అందింది. ప్రముఖ పబ్లిక్…
Aadhaar Card : భారతదేశంలో ప్రతి పౌరుడికి ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ…
PM Modi : ఎన్నికల రాజకీయాల్లో అనుభవం కలిగిన ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు.…
Samantha : అక్కినేని వారసుడు నాగచైతన్య, అగ్రనటి సమంత రూత్ ప్రభు ప్రేమకథ టాలీవుడ్లో ఒకప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది.…
Airtel : టెలికాం రంగంలో మరోసారి ధరల పెంపు చర్చకు దారి తీసింది. ప్రముఖ టెలికాం సంస్థ Airtel తన…
CM Chandrababu : తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని పలు కీలక…
This website uses cookies.