Home » Entertainment » Etv Special Show Ugadi Jatiratnalu
Entertainment

Ugadi jatiratnalu : ఉగాది జాతి రత్నాలు .. యూట్యూబ్‌లో సెన్షేషన్ క్రియేట్ చేస్తోంది.. వైర‌ల్ వీడియో

Authored By
vamana sai
The Telugu News | Updated on: April 12, 2021, 8:35 pm
Advertisement

Ugadi jatiratnalu : ప్రతీ పండుగకి ప్రముఖ టీవీ ఛానళ్ళు ఒకరికి ఒకరు పోటీ పడి పలు ఎంటర్‌టైన్మెంట్స్ ప్రోగ్రాంస్ ని డిజైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ ఖర్చు తో సెట్స్ నిర్మించి బుల్లితెర మీద పాపులారిటీ ఉన్న నటీ, నటులను.. పాపులర్ యాంకర్స్ ని మాత్రమే కాకుండా సిల్వర్ స్క్రీన్ మీద వీరీతంగా క్రేజ్ ఉన్న వాళ్ళని షోస్ కి తీసుకు వచ్చి అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్నారు. ప్రతీసారి ఎంటర్‌టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ అన్నట్టుగా ఎప్పటి కప్పుడు కొత్త కార్యక్రామలను అందిస్తూ ప్రేక్షకులకు భారీ స్థాయిలో ఎంజాయ్ మెంట్ ఇస్తున్నారు.

Advertisement

ఈ క్రమంలో తాజాగా ఉగాది జాతి రత్నాలు అన్న కంప్లీట్ ఎంటర్‌టైన్మెంట్ ప్రోగ్రాం ప్రముఖ ఛానల్ ఈటీవీలో ఉగాది పండుగ రోజు ప్రసారం కాబోతోంది. ఎప్పటిలాగానే ఈ కార్యక్రమం ఆధ్యంతం ఉల్లాసభరితంగా సాగుతుందని తాజాగా ప్రసారమవుతున్న ప్రోమోతో అర్థమవుతోంది. శ్రీముఖి, రష్మీ, సుదీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, డాన్సర్ పండు సహాలు పలువురు తమ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని, రీతు వర్మ కూడా గెస్ట్‌లుగా వస్తున్నారు.

ETV Special Show Ugadi jatiratnalu

Advertisement

Ugadi jatiratnalu : ఫోక్ సింగర్ మంగ్లీ తన గాత్రంతో మెస్మరైజ్ చేయబోతోంది.

అలాగే ఈ ప్రోగ్రాం లో సంగీత, ప్రియమణి, పూర్ణ, మనో సహా పలువురు జడ్జెస్ తమ ఆట పాటలతో అలరించనున్నారు. వకీల్ సాబ్ లో కీలక పాత్ర పోషించిన అంజలి, క్రాక్, నాంది సినిమాతో టాలీవుడ్ లో బాగా పాపులారిటీ తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతున్నారు. ప్రదీప్ మాచి రాజు తన మార్ ఎంటర్‌టైన్మెంట్ ఇవ్వబోతున్నాడు. ఇక ఫోక్ సింగర్ మంగ్లీ తన గాత్రంతో మెస్మరైజ్ చేయబోతోంది. మొత్తానికి ఉగాది జాతి రత్నాలు .. ఉగాది రోజు చేసే హంగామా అంతా ఇంతా కాదని లేటెస్ట్ ప్రోమోస్ చూస్తే తెలుస్తోంది.

vamana sai

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి