Nagarjuna : ఈ ఏడాది సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉంటాయని సినీ అభిమానులు ఆనందపడిపోయారు. కానీ, కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ పరిస్థితుల నేపథ్యంలో చిత్రాల విడుదల వాయిదా పడింది. ‘ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్’ రిలీజెస్ పోస్ట్ పోన్ అయ్యాయి. కాగా, ముందు అనుకున్న టైం ప్రకారంగా ఈ నెల 15న ‘బంగార్రాజు’ వచ్చేస్తున్నాడు. ఈ పిక్చర్ విడుదల సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ‘ఆర్ఆర్ఆర్’ గురించి నాగార్జున ఆసక్తికర కామెంట్స్ చేశారు.
కళ్యాణ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి సీక్వెల్గా వస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఈ నెల 15న సంక్రాంతి కానుకగా అనుకున్న టైంకు విడుదల అవుతోంది. ఇందులో తండ్రీ తనయులు నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్నారు. నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తుండగా, నాగచైతన్య సరసన హీరోయిన్గా ‘ఉప్పెన’భామ కృతి శెట్టి నటిస్తోంది. ఇకపోతే ఈ చిత్ర విడుదల సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న క్రమంలో నాగార్జున ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం గురించి మాట్లాడారు.పాన్ ఇండియా సినిమా అయిన ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ పోన్ అవడం బాధాకరమని, గతంలోనూ కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో పిక్చర్ రిలీజ్ పోస్ట్ పోన్ అయిందని గుర్తు చేశాడు.
సినిమా మేకర్స్ పడ్డ కష్టం గురించి తనకు వ్యక్తిగతంగా తెలుసని, అయితే, ఆ సినిమా ఇప్పుడు విడుదల కావాల్సినది కాదని నాగార్జున అన్నాడు. పాన్ ఇండియా లెవల్లో విడుదలై ఈ చిత్రం సక్సెస్ కావాల్సిన అవసరం ఉందని నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్’తో పాటు ‘రాధే శ్యామ్’ కూడా పాన్ ఇండియా పిక్చర్ అని, అది కూడా విడుదల ఆలస్యం అవడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నాడు. ఇకపోతే సంక్రాంతి కానుకగా ఈ సారి చిన్న సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో నాగార్జున, నాగచైతన్య నటించిన ‘బంగార్రాజు’ ఉండటం విశేషం. ఈ చిత్రంలో ‘జాతిరత్నాలు’ ఫేమ్ హీరోయిన్ ఫరియా అబ్దుల్లా స్పెషల్ సాంగ్ చేసింది.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.