Sri Reddy : తెలుగు ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్గా ఉండే నటి శ్రీరెడ్డి తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్, హీరోయిన్ పూనమ్ కౌర్, ప్రొడ్యూసర్ దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘రిపబ్లిక్’ ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వం, వైసీపీ మంత్రులపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీలో పెద్ద రాజకీయ దుమారమే రేగింది. వైసీపీ మంత్రులు, సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణ మురళి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలోనే జనసైనికులు, పవన్ కల్యాణ్ అభిమానులు తన ఇంటిపై దాడి చేశారని సినీ నటుడు పోసాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. పవన్ కల్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడటంతో పాటు తీవ్రంగా దూషించారు.
ఇకపోతే పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా శ్రీరెడ్డి స్పందించింది. శ్రీరెడ్డి మాట్లాడుతూ ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డిని గురించి అపహస్యం చేసి మాట్లాడటం సరికాదని పేర్కొంది. ఈ క్రమంలోనే జనసేనాని పవన్ కల్యాణ్ ఉద్దేశించి దూషించింది. తాను పవన్ కంటే జగమొండినని శ్రీరెడ్డి చెప్పింది. పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్తు, సినిమా భవిష్యత్తు ఉండబోదని విమర్శించింది. తాను ఆది శక్తినని, తను పూజించే ఆదిశక్తి ప్రకారంగా పవన్ కల్యాణ్ చేసిన పాపాలే ఆయన్ను చుట్టుకుంటాయని ఆరోపించింది. హీరోయిన్ పూనమ్ కౌర్కు సంబంధించిన వివరాలు బయటపెడతానని, తాను గతంలో చెప్పానని,ఆమెకు సంబంధించిన ఆధారాలు పెన్ డ్రైవ్ లో తన వద్ద ఉన్నాయని శ్రీరెడ్డి చెప్పింది.
ఇకపోతే టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్స్ హరీశ్ శంకర్, దేవ్ కట్టాపైన శ్రీరెడ్డి ఫైర్ అయింది. జగన్ను ఉద్దేశించి పవన్ మాట్లాడుతున్న క్రమంలో దిల్ రాజు, హరీశ్ శంకర్ నవ్వడాన్ని తప్పుబట్టింది. వారిని దూషించింది. ఈ క్రమంలోనే శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టింది. పవన్ కల్యాణ్ బహిరంగ సభలో తాట తీస్తా అని మాట్లాడిన మాటలు తప్పు అని శ్రీరెడ్డి పేర్కొంది. పవన్ కల్యాణ్ జనసైనికుల జీవితాలతో ఆడుకుంటున్నాడని విమర్శించింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.