Electricity bills : తెలంగాణ ప్రజలపై పడనున్న మరో పిడుగు.. విద్యుత్ ఛార్జిలు యూనిట్‌కు రూ.1 పెంపు..?

Advertisement
Advertisement

Electricity bills : తెలంగాణ ప్రజల నెత్తిన రాష్ట్ర సర్కార్ మరో పిడుగు వేయనున్నట్టు తెలుస్తోంది. డిస్కంలు తమ నష్టాలను తగ్గించేందుకు విద్యుత్ చార్జీలను తప్పకుండా పెంచాలని సర్కార్‌కు ప్రతిపాదనలు పంపింది. యూనిట్‌కు రూ.1 పెంచితే గానీ నష్టాల నుంచి తాము బయట పడలేమని తేల్చిచెప్పాయి. గత ఐదేళ్లుగా చార్జీలు పెంచనందున నష్టాలతో పాటు ఆర్థిక లోటు కూడా పెరిగిపోయిందని విద్యుత్ డిస్కంలు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి.

Advertisement

యూనిట్‌కు 5-10 పైసలు పెంచితే ఆర్థిక కష్టాలు ఇప్పట్లో తీరవని తెలిపాయట.. ప్రస్తుత, వచ్చే ఏడాది కలుపుకుని రూ.21,552 కోట్ల మేర ఆర్థిక లోటు ఉంటుందని డిస్కంలు ప్రభుత్వానికి, ఈఆర్‌సీ స్పష్టంచేశాయి. ఇవే కాకుండా ఏటా రూ.6 వేల కోట్ల నష్టాలు వస్తున్నట్టు సమాచారం. ఏటా సగటున 4 వేల కోట్ల యూనిట్ల పవర్‌ను డిస్కంలు ప్రజలకు అమ్ముతున్నాయి. యూనిట్‌కు 1 రూపాయి పెంచితే ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుత ఛార్జీలనే కొనసాగిస్తే వచ్చే ఏడాది (2022-23) రూ.10,928 కోట్లు లోటు ఉంటుందని తెలిపాయి. అయితే, యూనిట్‌కు రూపాయి పెంచిన రూ.6,928 కోట్లు ఆర్థిక లోటు మాత్రం కొనసాగుతుందని డిస్కంలు అంచనా వేశాయి.

Advertisement

telangana rs 1 increase per unit of electricity charges

Electricity bills : యూనిట్‌కు రూ.1 ధర పెంపు తప్పదా..

యూనిట్‌కు రూ.1 చొప్పున పెంచేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి ఆమోదం పొందాక ఈఆర్‌సీకి ఇవ్వాలని డిస్కంలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే, వారం రోజుల్లో ప్రతిపాదనలు ఇవ్వాలని డిస్కంలను ఈఆర్‌సీ గురువారం ఆదేశించింది. వచ్చే ఏడాది (2022-23)కు వార్షిక ఆదాయ అవసరాల(ఏఆర్‌ఆర్‌) నివేదికను ఇటీవల డిస్కంలు మండలికి అందించినా చార్జిల పెంపు ప్రతిపాదనలు మాత్రం ఇవ్వలేదట.

వచ్చే ఆర్థిక ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కరెంటు చార్జిలు పెంచాలంటే నవంబరు 30కల్లా ప్రతిపాదనలు ఇవ్వాల్సి ఉండగా.. వీటిపై తుది తీర్పు వెలువడటానికి కనీసం 120 రోజుల సమయం పడుతుందని ఈఆర్‌సీ తెలిపింది. అసలు ఛార్జీలపై ఇప్పటివరకు ప్రపోసల్స్ రాకపోవడంతో ఆ నివేదిక పనికిరాదని, దానిని ప్రజల ముందు కూడా ఉంచలేమని మండలి ఛైర్మన్‌ శ్రీరంగారావు స్పష్టం చేశారట.. దీంతో ఈఆర్‌సీ ఆదేశాలతో ఛార్జీల పెంపుపై డిస్కంలు గ్రౌండ్ వర్క్ ప్రారంభించాయి.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

21 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.