Categories: ExclusiveNewsvideos

Viral video : ఫోన్ మైకంలో పడి పిల్లాడిని ఫ్రిజ్ లో పెట్టిన తల్లి… ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో…!

Advertisement
Advertisement

Viral video : ప్రస్తుతం ఉన్న ఆధునిక కాలంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగస్వామి అయిపోయిందని చెప్పాలి.ఈ నేపథ్యంలోనే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్ అనేది కచ్చితంగా ఉంటుంది. మొబైల్ ఫోన్ లేని వ్యక్తి కనిపించాడంటే కచ్చితంగా అది ఒక వింత అనే చెప్పాలి. అలాంటి పరిస్థితులలో నేటి సమాజం జీవిస్తోంది. అంతేకాదు బయటకు వెళ్లేందుకు ఆటో కావాలన్నా…ఆకలేసినప్పుడు ఫుడ్డు కావాలన్నా… బోర్ కొడితే ఎంటర్టైన్మెంట్ కావాలన్నా… మొబైల్ ఫోన్ తప్పనిసరి అయిపోయింది. అంతేకాదు ఈ ఫోన్ ద్వారా ఆన్ లైన్ షాపింగ్ వేరే ఖండాల్లో ఉన్నవారితో సైతం మాట్లాడుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ ద్వారా అన్ని అవసరాలను మన దగ్గరికి వచ్చేలా చేసుకోవచ్చు. అందుకే నేటి కాలంలో మొబైల్ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచం అరచేతిలో ఉన్నట్లే అని పెద్దలు అంటున్నారు. దీంతో నేటి కాలంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ విపరీతంగా ఉపయోగిస్తున్నారు.

Advertisement

అయితే వాస్తవానికి ఈ మొబైల్ ఫోన్ వలన మనిషి జీవితంలో అనేక రకాల మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ పెరిగిందని సంతోషపడాలో లేదా అదే టెక్నాలజీకి బలవుతున్న మనుషులను చూసి బాధపడాలో అర్థం కావడం లేదు. మన తాతల కాలంలో సాయంత్రం వేళ అందరూ అరుగులపై కూర్చొని ముచ్చట్లు పెడితే నేటి కాలంలో ఫోన్ మాయాజాలంలో పడి పక్కవారితో సైతం మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. అలాగే మన చిన్నప్పుడు చందమామను చూపిస్తూ గోరుముద్దలు తింటే ఇప్పుడు మాత్రం పిల్లల చేతికి ఫోన్ ఇవ్వనిదే నోట్లో ముద్ద కూడా పెట్టనివ్వడం లేదు. ఇలాంటి పరిస్థితులను చూస్తుంటే మనం ఎలాంటి స్టేజ్ లో ఉన్నామో అర్థం చేసుకోవచ్చు. చిన్నపిల్లలతో పాటు పెద్దవారు సైతం మొబైల్ ఫోన్ లో గేమ్స్ ఆడుతూ సోషల్ మీడియాను చూస్తూ మైమర్చిపోతున్నారు. ఈ తరుణంలోనే చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోని పరిస్థితులలో కనిపిస్తున్నాయి.

Advertisement

Viral video తల్లి ఫోన్ లోనే నిమగ్నం

ఈ క్రమంలోనే ఈ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోని గమనించినట్లయితే ఓ ఇంట్లో తల్లి తండ్రి చిన్నబాబు ఉంటున్నారు. ఈ క్రమంలోనే చిన్నపిల్లాడు హాల్లో ఆడుకుంటూ ఉండగా తన తల్లికి ఫోన్ రావడంతో ఫోన్ మాట్లాడుకుంటూ ఫోన్ లోనే నిమగ్నం అవుతుంది. ఈ క్రమంలోనే తన పనులు తాను చేసుకుంటూ పిల్లాడు ఆడుకుంటుండగా చూస్తూ ఉంటుంది. పంట కోసం కూరగాయలు తరిగి మిగిలిన కూరగాయలను ఫ్రిడ్జ్ లో పెట్టాలి అనుకుంటుంది. కానీ ఫోన్ మాట్లాడుతూ ఫోన్ మాయలో మునిగిపోయిన ఆ తల్లి కూరగాయలకు బదులుగా హాల్లో ఆడుకుంటున్న చిన్నపిల్లల్ని తీసుకెళ్లి ఫ్రిజ్ లో పెట్టింది. ఇంతలోకే ఆ పిల్లాడి తండ్రి స్నానం చేసి హాల్ లోకి వస్తాడు. పిల్లాడు కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్లాడని టెన్షన్ పడుతూ భార్యని అడుగుతాడు. అయితే ఫోన్ మైకంలో తాను ఏం చేసిందో తెలియని భార్య పిల్లాడి కోసం ఏడుస్తూ కూర్చుంటుంది. ఇక పిల్లాడిని ఇంట్లో ఎక్కడ వెతికిన కనిపించడు.

ఇదే సమయంలో తండ్రికి ఆ పిల్లాడి ఏడుపు వినిపిస్తుంది. ఏడుపు శబ్దం వింటూ తండ్రి ఫ్రిడ్జ్ డోర్ వద్దకు చేరుకుంటాడు. పిల్లాడి ఏడుపు శబ్దం ఫ్రిడ్జ్ నుండి రావడాన్ని గమనించిన తండ్రి ఫ్రిడ్జ్ డోర్ తీసి చూడగా అందులో పిళ్లాడు కనిపిస్తాడు. ఇంకేముంది ఫ్రిడ్జ్ లోకి కొడుకు ఎలా వెళ్లాడో తెలియని పరిస్థితిలో ఉన్న భార్య వెంటనే కొడుకుని ఎత్తుకొని మొద్దాడుతుంది. ఈ విధంగా ఫోన్ మైకంలో పడి తల్లి తన సొంత బిడ్డని చంపుకునే పరిస్థితి ఏర్పడింది. తన తండ్రి ఇంకాస్త ఆలస్యం చేసుంటే ఆ పిల్లాడు ఫ్రిజ్ లో చలి తట్టుకోలేక చనిపోయి ఉండేవాడు. అయితే ఈ వీడియోలో ఆ తల్లి ఫోన్ కు ఎంతలా ఎడిక్ట్ అయిందో మనందరికీ అర్థమయ్యే ఉంటుంది. ప్రస్తుత కాలంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి అనడానికి ఈ వీడియో నిదర్శనం అని చెప్పాలి. కావున మొబైల్ ను అవసరమైన వరకే వాడడం మంచిది. అంతకుమించి వాడితే ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వీడియో నేటి కాలంలో కొందరికైనా అవేర్నెస్ కల్పించేలా చేస్తే చాలు. మరి ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేసి ఇలాంటి పరిస్థితులకు గురికాకుండా జాగ్రత్త పడండి.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

30 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

10 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

11 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

12 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

14 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

16 hours ago

This website uses cookies.