
#image_title
ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ టీచర్ కి సంబంధించిన వీడియో దేశమంతా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ సేహోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని మోగ్రా అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ధరమ్ సింగ్ వర్మ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే తాజాగా తరగతిది గదిలో అతడు చేసిన నిర్వాకం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తరగతి గదిలోకి రాగానే పాఠాలు చెప్పాల్సిన అతను, అందుకు విరుద్ధంగా క్లాసు రూమ్ లోకి రాగానే దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. టీచర్ పడుకోవడంతో విద్యార్థులు ఇదే మంచి సమయం అని ఎంచక్కా బయటికి వెళ్లి ఆటలు ఆడడంలో మునిగిపోయారు. అయినా టీచర్ మాత్రం ఏ మాత్రం సోయి లేకుండా ప్రపంచంతో నాకేమీ సంబంధం లేనట్లుగా గాఢ నిద్రలో మునిగిపోయాడు. అయితే పిల్లలంతా బయట ఆడుకోవడం చూసిన గ్రామ ప్రజలు లోపలికి వచ్చి చూడగా టీచర్ పడుకొని ఉన్నారు.
#image_title
టీచర్ నిర్వాకం చూసి షాక్ అయ్యి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చివరకు ఈ విషయం జిల్లా విద్యా అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ ఆదేశించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కుర్చీలో కూర్చొని కునుకు తీసే టీచర్లను చూశాం, కానీ ఇలాంటి టీచర్లను ఎప్పుడూ చూడలేదని కొందరు, ఈయనకు క్లాస్ రూమ్, బెడ్ రూమ్ ఒకటేనేమో అని మరికొందరు, ఇలాంటి టీచర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంకొందరు కామెంట్లు చేశారు.
Prabhas : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకేసారి విడుదలవుతున్నాయంటే బాక్సాఫీస్ వద్ద యుద్ధ వాతావరణం…
Realme P4 Power 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ రియల్మీ (Realme) భారత మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్ఫోన్ను…
Upi Payments Fail : భారతదేశంలో డిజిటల్ విప్లవానికి చిహ్నంగా మారిన యూపీఐ సేవలు ఎంత వేగంగా ఉన్నాయో, సాంకేతిక…
Sunitha : ప్రముఖ సంగీత రియాలిటీ షో 'పాడుతా తీయగా' సీజన్-26 తాజా ఎపిసోడ్ ప్రోమో సంగీత ప్రియులను విశేషంగా…
Tirumala Laddu Prasadam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ జరిగిందంటూ గత కొంతకాలంగా…
Ys Jagan : ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇన్నాళ్లూ అనుసరించిన…
Vijay Karthik - Keerthi Bhat : బుల్లితెర నటి, 'కార్తీకదీపం' ఫేమ్ కీర్తి భట్ మరియు ఆమె కాబోయే…
KCR : తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలక అడుగు…
This website uses cookies.