ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ టీచర్ కి సంబంధించిన వీడియో దేశమంతా వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రదేశ్ సేహోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని మోగ్రా అనే గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ధరమ్ సింగ్ వర్మ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే తాజాగా తరగతిది గదిలో అతడు చేసిన నిర్వాకం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
తరగతి గదిలోకి రాగానే పాఠాలు చెప్పాల్సిన అతను, అందుకు విరుద్ధంగా క్లాసు రూమ్ లోకి రాగానే దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. టీచర్ పడుకోవడంతో విద్యార్థులు ఇదే మంచి సమయం అని ఎంచక్కా బయటికి వెళ్లి ఆటలు ఆడడంలో మునిగిపోయారు. అయినా టీచర్ మాత్రం ఏ మాత్రం సోయి లేకుండా ప్రపంచంతో నాకేమీ సంబంధం లేనట్లుగా గాఢ నిద్రలో మునిగిపోయాడు. అయితే పిల్లలంతా బయట ఆడుకోవడం చూసిన గ్రామ ప్రజలు లోపలికి వచ్చి చూడగా టీచర్ పడుకొని ఉన్నారు.
టీచర్ నిర్వాకం చూసి షాక్ అయ్యి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. చివరకు ఈ విషయం జిల్లా విద్యా అధికారుల దృష్టికి వెళ్ళింది. దీంతో ఈ విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ ఆదేశించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కుర్చీలో కూర్చొని కునుకు తీసే టీచర్లను చూశాం, కానీ ఇలాంటి టీచర్లను ఎప్పుడూ చూడలేదని కొందరు, ఈయనకు క్లాస్ రూమ్, బెడ్ రూమ్ ఒకటేనేమో అని మరికొందరు, ఇలాంటి టీచర్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఇంకొందరు కామెంట్లు చేశారు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.