ప్రస్తుత సమాజంలో ప్రేమానురాగాల కంటే కక్షలు.. పంతాలకు పోయి మనుషులు ప్రాణాలు తీసేస్తున్నారు. అది బయట వ్యక్తి అయినా కుటుంబంలో ఉన్న వ్యక్తి అయినా సరే.. మానవత్వంగా ఆలోచించకుండా అడవిలో మృగం మాదిరిగా మనిషి ప్రవర్తిస్తున్నాడు. ఆఖరికి రక్తసంబందులను చివర ఆఖరికి కట్టుకున్న వ్యక్తులను సైతం పంతాలకు పోయి హత్యలు చేసేస్తున్నారు. సరిగ్గా ఈ రకంగానే భార్యను భర్త అతికిరాతకంగా చంపటంతో.. అది చూసిన లేత చిన్న వయసు కలిగిన కొడుకు పెద్దయ్యాక తండ్రికి శిక్ష పడేలా న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పాడు.ఈ ఘటన ముంబైలో జరిగింది. భార్యను చంపిన ఘటనలో భర్తకు ముంబాయి కోర్టు జీవిత ఖైదు విధించింది. 2016 నుంచి ఈ కేసుకు సంబంధించి విచారణ జరుగుతుంది.
కాగా సరైన సాక్ష్యం లేకపోవడంతో నిందితుడు తప్పించుకోవచ్చని భావించాడు. ఈ క్రమంలో సమాజానికి న్యాయస్థానాలకు తన కొడుకు మానసిక రోగి అని.. తండ్రి నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ కొడుకే తండ్రికి జీవిత ఖైదు శిక్ష పడేలా చేసి తల్లికి న్యాయం చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే ముంబైకి చెందిన ఉమేష్ అనే డెంటల్ వైద్యుడికి.. తనుజాతో 2009లో పెళ్లయింది. వీరిద్దరికీ కొడుకు కూడా జన్మించాడు. అయితే కొద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ప్రతిరోజు గొడవలు పడుతుండేవారు. అయితే ఒక రోజు గొడవ గట్టిగా జరగడంతో కొడుకుని తీసుకుని తనుజ పుట్టింటికి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత ఉమేష్ భార్య తన తనూజ నీ ఎన్నిసార్లు పిలిచినా ఇంటికి రాకపోవటంతో.. భార్యపై కోపం పెంచుకున్నాడు. ఈ క్రమంలో 2016 డిసెంబర్ 11వ తారీఖున.. తనూజా ఉంటున్న ఇంటికి వచ్చి 37 సార్లు కత్తితో పొడిచే అతి కిరాతకంగా చంపాడు. ఆ తర్వాత పోలీసులకు ఫోన్ చేసి ఉమేష్ లొంగిపోవడం జరిగింది. మధ్య జరుగుతున్న సమయంలో ఆ దంపతుల నాలుగేళ్ల కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. అయితే తన తండ్రి.. తల్లిని ఎలా హత్య చేశాడో కోర్టులో.. ఇటీవల పూసగుచ్చినట్లు చెప్పి శిక్షపడేలా చేశాడు.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.