
CM Chandrababu Naidu : వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం : చంద్రబాబు
CM Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలకు, ప్రజల ఆశలకు నూతన స్పూర్తినిచ్చాయి. అమరావతిని కేవలం ఒక నగరంగా కాకుండా ఐదు కోట్లమందికి సెంటిమెంట్గా అభివర్ణించారు. గతంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు ప్రారంభమయ్యాయని గుర్తు చేసిన ఆయన, మళ్లీ అదే విధంగా మోదీ చేతుల మీదుగా పనుల పునఃప్రారంభం జరగడం గర్వకారణమన్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రాజధాని నిర్మాణం నిలిచిపోయిందని, రైతులు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
CM Chandrababu Naidu : వెంటిలేటర్పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం : చంద్రబాబు
ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన చంద్రబాబు, భారత్ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను గుర్తుచేశారు. పదో స్థానంలో ఉన్న దేశం, ఇప్పుడు ఐదో స్థానానికి చేరిందని, త్వరలో మూడో స్థానంలో నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కులగణన నిర్ణయాన్ని మోదీ తీసుకున్న నిర్ణయం గొప్పదిగా అభివర్ణించారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి రెండింటినీ లక్ష్యంగా పెట్టుకుని ప్రధాని పని చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ను మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతిని ప్రపంచంలో గుర్తింపు పొందే భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దే దిశగా చేపట్టిన ఈ పునర్నిర్మాణం, రాష్ట్ర ప్రజలకు కొత్త ఆశల రేకెత్తిస్తోంది. 5 లక్షలమంది విద్యార్థులు అక్కడ చదువుకునేలా శ్రేష్ఠ విద్యాసంస్థలను తీసుకురావడమే కాక, గ్రీన్ ఎనర్జీ ఆధారంగా కాలుష్యరహిత నగరంగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తవుతుందని చెప్పారు. రాష్ట్రం మొత్తాన్ని అభివృద్ధి చేయడం, నదుల అనుసంధానం, భోగాపురం ఎయిర్పోర్టు, విశాఖ స్టీల్ప్లాంట్, రామాయపట్నం పోర్టు వంటి మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తున్నట్టు చెప్పారు. అమరావతి పునర్నిర్మాణంతో ప్రజల నమ్మకాన్ని తిరిగి పొందినట్టు సీఎం వ్యాఖ్యలు సంకేతంగా నిలిచాయి.
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
Donald Trump : అమెరికా రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనానికి తెరలేపే డొనాల్డ్ ట్రంప్, ఈసారి ఏకంగా దైవదూత…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో…
TDP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్లు రాజ్యసభ ఎన్నికల వైపు ఉన్నాయి. రాష్ట్రం నుంచి…
Virat Kohli : క్రికెట్ మైదానంలో విరాట్ కోహ్లీ అంటేనే ఒక ఎనర్జీ. మ్యాచ్ గెలిచినా, ఓడినా, వికెట్ పడినా తనదైన…
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్టాపిక్గా మారాయి. తెలంగాణ జాగృతి…
Drumstick Farming : మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పరిధిలో ఉన్న పంఢర్పూర్ ప్రాంతం కరువు బాధితంగా పేరుగాంచింది. ఇక్కడ నీటి…
Half Day Schools : రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత మరింత పెరుగుతోంది. భానుడి ప్రతాపం అధికమవడంతో ప్రజలు తీవ్ర…
Gas Cylinder : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో గ్యాస్ సరఫరాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి మూతపడటం…
Ration Rice : మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రేషన్ దుకాణాల వద్ద…
Agricultural Land Tax Rules : వ్యవసాయ భూమిని అమ్మడం చాలా మందికి జీవితంలో ఒక కీలక నిర్ణయం. పెళ్లిళ్లు,…
Mavigun : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఇప్పుడు ఒక కొత్త మలుపు తిరిగింది. అమరావతిలో…
This website uses cookies.