
Andhra Pradesh Voters : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా విడుదల... మహిళా ఓటర్లే అధికం...ఆందోళనలో కూటమి...!
Andhra Pradesh Voters : ఆంధ్రప్రదేశ్ లో మరో 10 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ఇటీవల వెళ్లడైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఓటర్ల జాబితాను విడుదల చేశారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక వీరిలో పురుష ఓటర్ల విషయానికొస్తే దాదాపు 2,03,39,851 మంది పురుష ఓటర్లు ఉండగా 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే పురుషులకంటే మహిళా ఓటర్లు 7,18,764 మంది ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
అంతేకాక రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన జాబితాలో వెల్లడైంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే154 నియోజకవర్గాలలో కూడా మహిళా ఓటర్ల ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం అనేది కూటమిని కాస్త భయాందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో మహిళలకు ఎక్కువగా సంక్షేమాలు అందిస్తూ వారిని తన ఓట్ బ్యాంక్ గా మార్చుకున్నాడు.
అంతేకాక దాదాపు లక్ష మంది గృహినీలకు సొంతింటి కల నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలను కూడా వారి పేరుతోనే అందించాడు జగన్. దీంతోపాటు అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాలను కూడా జగన్ ప్రభుత్వం మహిళల ఖాతాలోకి పంపుతూ వచ్చింది. అలాగే డ్వాక్రా రుణాలను మాఫీ చేసి డ్వాక్రా మహిళల పాలిట జగన్ శ్రేయోభిలాషిగా మారిపోయారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మహిళా పక్షపాతి అనే ముద్ర వేయించుకోగలిగారు.దీంతో ఎన్నికల్లో వైయస్ జగన్ కు అధిక మొత్తంలో మహిళల ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉంటే.
Andhra Pradesh Voters : ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా విడుదల… మహిళా ఓటర్లే అధికం…ఆందోళనలో కూటమి…!
ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ చంద్రబాబు నాయుడుని నమ్మకద్రోహిగా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చేయలేదు. అదేవిధంగా మహిళలు బ్యాంకుల్లో పెట్టినటువంటి బంగారాన్ని ఇంటికి తీసుకొస్తానని నమ్మించి ఆ తర్వాత అందరిని నట్టేట ముంచారు. దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబుని నమ్మించి మోసగించే నాయకుడిగా గుర్తుపెట్టుకున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కూటమికి ఇది ఎదురు దెబ్బ అని చెప్పాలి. అంతేకాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన రాజకీయపరంగా కూటమికి ఇది ఆందోళన కలిగించే విషయం. ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీపార్టీ ఆనందంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పలు సర్వేలలో 60 శాతం మంది మహిళలు వైసీపీ పార్టీకే ఓటు వేస్తారని వేళ్లడైంది. దీంతో ఈ సర్వేలన్నీ కూడా కూటమిని పెద్ద ఎత్తున కలవరపెడుతున్నాయి. అంతేకాక మరోసారి అధికారం ఇస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగడంతో పాటు , ఇంకాస్త ఎక్కువగా సంక్షేమం అందిస్తామని జగన్ ప్రభుత్వం చెప్పడంతో మహిళల్లో ఒక నమ్మకం ఏర్పడింది. దీంతో జగన్ చెబితే చేస్తాడు అనే నమ్మకంతో మహిళలు కచ్చితంగా వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. మరి రానున్న ఎన్నికల్లో ఇదే జరిగితే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతోంది. అదే నారా లోకేష్ మార్క్…
Telangana : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సామాజిక, ఆర్థిక, సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలను…
SSC Notification 2026 : దేశవ్యాప్తంగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం మంచి అవకాశాన్ని అందించింది. సెంట్రల్…
Chanakyaniti : సాధారణంగా చాణక్యుడు చెప్పిన నీతి సూత్రాలు మనిషి జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో నడిపించడానికి ఎంతగానో తోడ్పడతాయి. ముఖ్యంగా…
Reels Watching : నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా మన జీవనశైలిలో అంతర్భాగంగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఫోన్…
Jeera Water : ఈ రోజుల్లో ఆరోగ్యంపై ప్రజల్లో విపరీతమైన అవగాహన పెరిగింది. సాధారణ వ్యక్తుల నుంచి సెలబ్రిటీల వరకు…
summer : వేసవి కాలం క్రమంగా తీవ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మనందరిపై ప్రభావం చూపుతున్నప్పటికీ చిన్న పిల్లలపై…
Foreign Trip : సాధారణంగా మనలో చాలా మందికి విదేశీ ప్రయాణం చేయాలని ఒక కల ఉంటుంది. కానీ ఫారిన్…
Ys Family : వైఎస్ కుటుంబానికి సంబంధించి గత పాతికేళ్ల కిందట ఒక ఊహించని సంఘటన జరిగిందనే వార్త ఇప్పుడు…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు వైఎస్ జగన్ నిర్ణయాలు మళ్ళీ హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. గత ఎన్నికల వరకు వైసిపి వెనుక ఉండి…
Ananya Nagalla : అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న మూవీ "లీసా". ఈ చిత్రాన్ని వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
This website uses cookies.