Andhra Pradesh Voters : ఆంధ్రప్రదేశ్ లో మరో 10 రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా ఇటీవల వెళ్లడైంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ సార్వత్రిక ఎన్నికలకి సంబంధించి ఓటర్ల జాబితాను విడుదల చేశారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 4,14,01,887 మంది ఓటర్లు ఉన్నట్లుగా గుర్తించారు. ఇక వీరిలో పురుష ఓటర్ల విషయానికొస్తే దాదాపు 2,03,39,851 మంది పురుష ఓటర్లు ఉండగా 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అయితే పురుషులకంటే మహిళా ఓటర్లు 7,18,764 మంది ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది.
అంతేకాక రాష్ట్రంలోని 26 జిల్లాల్లో కూడా పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నట్లు తాజాగా విడుదల చేసిన జాబితాలో వెల్లడైంది. ఇక నియోజకవర్గాల వారీగా చూసినట్లయితే154 నియోజకవర్గాలలో కూడా మహిళా ఓటర్ల ఎక్కువగా ఉన్నారు. అయితే ప్రస్తుతం మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం అనేది కూటమిని కాస్త భయాందోళనకు గురిచేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పాలనతో మహిళలకు ఎక్కువగా సంక్షేమాలు అందిస్తూ వారిని తన ఓట్ బ్యాంక్ గా మార్చుకున్నాడు.
అంతేకాక దాదాపు లక్ష మంది గృహినీలకు సొంతింటి కల నెరవేర్చే క్రమంలో ఇంటి పట్టాలను కూడా వారి పేరుతోనే అందించాడు జగన్. దీంతోపాటు అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాలను కూడా జగన్ ప్రభుత్వం మహిళల ఖాతాలోకి పంపుతూ వచ్చింది. అలాగే డ్వాక్రా రుణాలను మాఫీ చేసి డ్వాక్రా మహిళల పాలిట జగన్ శ్రేయోభిలాషిగా మారిపోయారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరితో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మహిళా పక్షపాతి అనే ముద్ర వేయించుకోగలిగారు.దీంతో ఎన్నికల్లో వైయస్ జగన్ కు అధిక మొత్తంలో మహిళల ఆదరణ లభిస్తుంది. ఇదిలా ఉంటే.
ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ చంద్రబాబు నాయుడుని నమ్మకద్రోహిగా గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చేయలేదు. అదేవిధంగా మహిళలు బ్యాంకుల్లో పెట్టినటువంటి బంగారాన్ని ఇంటికి తీసుకొస్తానని నమ్మించి ఆ తర్వాత అందరిని నట్టేట ముంచారు. దీంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబుని నమ్మించి మోసగించే నాయకుడిగా గుర్తుపెట్టుకున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో కచ్చితంగా కూటమికి ఇది ఎదురు దెబ్బ అని చెప్పాలి. అంతేకాక ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన రాజకీయపరంగా కూటమికి ఇది ఆందోళన కలిగించే విషయం. ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీపార్టీ ఆనందంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే పలు సర్వేలలో 60 శాతం మంది మహిళలు వైసీపీ పార్టీకే ఓటు వేస్తారని వేళ్లడైంది. దీంతో ఈ సర్వేలన్నీ కూడా కూటమిని పెద్ద ఎత్తున కలవరపెడుతున్నాయి. అంతేకాక మరోసారి అధికారం ఇస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగడంతో పాటు , ఇంకాస్త ఎక్కువగా సంక్షేమం అందిస్తామని జగన్ ప్రభుత్వం చెప్పడంతో మహిళల్లో ఒక నమ్మకం ఏర్పడింది. దీంతో జగన్ చెబితే చేస్తాడు అనే నమ్మకంతో మహిళలు కచ్చితంగా వైసీపీ పార్టీకి ఓట్లు వేస్తారని వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నాయి. మరి రానున్న ఎన్నికల్లో ఇదే జరిగితే మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Ginger Juice : అల్లం లో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అనే సంగతి మన అందరికీ తెలిసిన…
Current Affairs : వివిధ ప్రవేశ పరీక్షలతో పాటు సివిల్ సర్వీస్ పరీక్షలలో విజయం సాధించాలని ఆశించే యువత ప్రపంచంలోని…
New Ration Card : తెలంగాణ ప్రభుత్వం తన పౌరుల సంక్షేమాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో రేషన్ కార్డుల పంపిణీ వ్యవస్థలో…
Boom Boom Beer : ఏపీలో మద్యం ప్రియులు గత కొన్నాళ్లుగా సరికొత్త విధానాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కొత్త…
Ap Womens : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలులోకి వచ్చాక సూపర్ సిక్స్ పథకం అమలు దిశగా వడివడిగా అడుగులు…
New Liquor Policy : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. కొత్తగా మద్యం…
Chandrababu : గత కొన్ని రోజులుగా ఏపీలో మెడికల్ సీట్ల వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. తన హయాంలో…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్…
This website uses cookies.