AP Pension : పెన్షన్పై ఏపీ సర్కార్ గుడ్న్యూస్..!
AP Spouse Pension : ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్ మొత్తాన్ని రూ.4,000కు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా పెన్షన్ విధానంలో ప్రభుత్వం మరో కీలక మార్పు తీసుకువచ్చింది. భర్త మరణం పొందిన తర్వాత భార్య పెన్షన్ కోసం ఎదురు చూడకుండా వెంటనే పించను మంజూరు చేసే విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. సీఎం చంద్రబాబు గతేడాది నవంబరు 1న శ్రీకాకుళం జిల్లా పర్యటన సందర్బంగా స్పౌజ్ క్యాటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛను మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భర్త మరణించిన వెంటనే భార్యకు ఆర్థిక సహాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
AP Pension : పెన్షన్పై ఏపీ సర్కార్ గుడ్న్యూస్..!
ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో స్పౌజ్ పెన్షన్ ఆప్షన్ ఓపెన్ చేశారు. భర్త చనిపోతే డెత్ సర్టిఫికెట్, భార్య ఆధార్ కార్డు జిరాక్స్ తో గ్రామ, వార్డు సచివాలయాల్లో అధికారుల్ని సంప్రదించాలని సూచించారు. మార్చి 15వ తేదీలోపు దరఖాస్తులు ఎంపీడీవో/ఎంసీ స్థాయిలో ఆమోదం పొందినట్టు అయితే వచ్చే నెల నుంచి స్పౌజ్ పెన్షన్ కింద రూ.4000 మంజూరు అవుతాయి.
– పెన్షనర్ మరణించిన విషయాన్ని జీవిత భాగస్వామి ముందుగా బ్యాంకుకు తెలుపాలి.
– కుటుంబ పెన్షన్ ప్రారంభించమని బ్యాంకును కోరాలి.
– పెన్షనర్ మరణ ధృవీకరణ పత్రం, పీపీఓ కాపీ, వయస్సు/పుట్టిన తేదీ రుజువు, అదనపు చెల్లింపును తిరిగి పొందేందుకు ఒక హామీ పత్రాన్ని జతచేయాలి.
Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…
Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్కు…
Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్గా మారారు.…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…
Nepal Crisis Deepens : నేపాల్లో జెన్-జెడ్ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…
Apple Event | ఐఫోన్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తన…
Group 1 | గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…
Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…
This website uses cookies.