Bill Gates : బిల్ గేట్స్ ని ఇండియా నుంచి గెంటేయండి .. కూటమి కి షాక్ ఇస్తూ తీవ్ర నిరసనలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bill Gates : బిల్ గేట్స్ ని ఇండియా నుంచి గెంటేయండి .. కూటమి కి షాక్ ఇస్తూ తీవ్ర నిరసనలు

 Authored By siddhu | The Telugu News | Updated on :17 February 2026,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Bill Gates : బిల్ గేట్స్ ని ఇండియా నుంచి గెంటేయండి .. కూటమి కి షాక్ ఇస్తూ తీవ్ర నిరసనలు

Bill Gates  : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Andhra pradesh Government బిల్ గేట్స్ రాకను ఒక గొప్ప అవకాశంగా చూస్తూ అతనికి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తుంటే సోషల్ మీడియాలో మాత్రం అతనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా ఎక్స్ వేదికగా బిల్ గేట్స్ క్విట్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. అసలు మన దేశ ప్రజలు ఒకప్పుడు టెక్నాలజీ దిగ్గజంగా కొలిచిన వ్యక్తిని ఇప్పుడు ఎందుకు ఇంతలా వ్యతిరేకిస్తున్నారు అనే అంశంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం గతంలో బిల్ గేట్స్ భారతదేశం గురించి చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలే అని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. మన దేశాన్ని ఆయన ఒక ప్రయోగశాలగా చూస్తున్నారని ఇక్కడ ఎలాంటి ప్రయోగాలు అయినా చేసుకోవచ్చనే అర్థం వచ్చేలా మాట్లాడటంపై సామాన్యులు తీవ్రంగా మండిపడుతున్నారు. మన దేశ ప్రజలను ప్రయోగాలకు వాడే ఎలుకల్లా చూస్తున్నారనే కోపం చాలా మందిలో కనిపిస్తోంది.

Bill Gates బిల్ గేట్స్ ని ఇండియా నుంచి గెంటేయండి కూటమి కి షాక్ ఇస్తూ తీవ్ర నిరసనలు

Bill Gates : బిల్ గేట్స్ ని ఇండియా నుంచి గెంటేయండి .. కూటమి కి షాక్ ఇస్తూ తీవ్ర నిరసనలు

Bill Gates బిల్ గేట్స్ క్విట్ ఇండియా నిరసనల వెనుక అసలు కారణాలు

ఈ వ్యతిరేకత వెనుక కేవలం మాటలే కాకుండా గతంలో జరిగిన కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. 2009 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో జరిగిన ఒక సంఘటనను నెటిజన్లు ఇప్పుడు మళ్ళీ తెరపైకి తెస్తున్నారు. అప్పట్లో బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రయోగాల వల్ల ఐదుగురు చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోయారని అప్పట్లో పెద్ద గొడవే జరిగింది. అది మాత్రమే కాకుండా ఆ వ్యాక్సిన్ వల్ల చాలా మంది పిల్లలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల బారిన పడ్డారని చాలా మంది ఆరోపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఆహ్వానించి ఇక్కడ మరిన్ని ప్రయోగాలు చేయడానికి అవకాశం ఇస్తున్నారనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఒక పక్క ప్రభుత్వం దీనిని అభివృద్ధిగా చూపిస్తుంటే మరోపక్క ప్రజలు మాత్రం పాత గాయాలను గుర్తు చేసుకుంటున్నారు.

బిల్ గేట్స్ కేవలం టెక్నాలజీ కి మాత్రమే పరిమితం కాకుండా ఆరోగ్యం మరియు వ్యవసాయం వంటి కీలక రంగాల్లో కూడా జోక్యం చేసుకోవడం చాలా మందికి నచ్చడం లేదు. మన దేశ పాలసీలను డిక్టేట్ చేసే స్థాయికి అతనికి అధికారం ఎలా ఇస్తారని కొందరు నేరుగా ప్రధాని కార్యాలయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో ఆరోపణలు ఉన్న వ్యక్తికి మన దేశంలో చోటు ఇవ్వకూడదని అతని పర్యటనను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ మరియు క్లైమేట్ కంట్రోల్ పేరుతో ఇక్కడ ఏవో కొత్త ప్రయోగాలు చేసి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారేమో అన్న భయం సోషల్ మీడియా పోస్టుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక పక్క ప్రపంచ వ్యాప్తంగా అతనిపై వస్తున్న కొన్ని ఫైల్స్ వివరాలు కూడా ఈ నిరసనలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతకు ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు మధ్య ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.

siddhu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది