New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారోచ్ ..!
New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది గొప్ప శుభవార్త గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇప్పటికే 63.32 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. ఈ కొత్త నిర్ణయం ద్వారా దాదాపు 6 లక్షల మంది కొత్త దరఖాస్తుదారులు లబ్ధిపొందే అవకాశముందని అంచనా. ప్రభుత్వం నెలకు రూ.250 కోట్ల అదనపు భారం ఎదుర్కొనాల్సి వచ్చినా, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది.
New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారోచ్ ..!
గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అర్హులు పింఛన్ పొందలేకపోయారు. పలు ఆరోపణలు వెలుగుచూశాయి. దివ్యాంగుల కోటాలో బోగస్ సర్టిఫికెట్లు ఉపయోగించి దుర్వినియోగం జరిగినట్లు వెలుగు చూసిన నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ధృవీకరణ ప్రక్రియ చేపట్టి, నిజమైన అర్హులను గుర్తించనుంది. ఇలా డేటా ఆధారిత విధానంతో పింఛన్ల పంపిణీని నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ కొత్త పింఛన్ల విధానం అమలులో భాగంగా మేలో పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. జూన్ నుంచి పంపిణీ ప్రారంభమయ్యే అవకాశముంది. జులైలో కొత్త దరఖాస్తులు స్వీకరించి, ఆగస్టు నుంచి ఎంపికైన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పాలసీ ప్రకటనను త్వరలోనే అధికారికంగా వెలువరించనుంది. ఇది పింఛన్ కోసం నిరీక్షణలో ఉన్న లక్షలాది ప్రజలకు ఊరట కలిగించే వార్తగా నిలుస్తోంది.
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
Etela Rajender : కాళేశ్వరం ప్రాజెక్ట్పై జరుగుతున్న కమిషన్ విచారణలో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.…
Telangana Cabinet Expansion : ఎన్నాళ్లుగానో వేచి చూస్తు మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకి సాకారం అయింది.. కొత్తగా మంత్రివర్గంలో ముగ్గురు…
Today Gold Price : ప్రస్తుతం బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. జూన్ 8వ తేదీ ఆదివారం నాటి…
This website uses cookies.