New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారోచ్ ..!
New Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద ప్రజల కోసం మరో సంక్షేమ నిర్ణయం తీసుకుంది. కొత్తగా అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయ్యింది. ఇప్పటికే పింఛన్ కోసం ఎదురు చూస్తున్నవారికి ఇది గొప్ప శుభవార్త గా చెప్పొచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఇప్పటికే 63.32 లక్షల మందికి పింఛన్లు అందుతున్నాయి. ఈ కొత్త నిర్ణయం ద్వారా దాదాపు 6 లక్షల మంది కొత్త దరఖాస్తుదారులు లబ్ధిపొందే అవకాశముందని అంచనా. ప్రభుత్వం నెలకు రూ.250 కోట్ల అదనపు భారం ఎదుర్కొనాల్సి వచ్చినా, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముందడుగు వేస్తోంది.
New Pensioners : ఏపీలో కొత్త పెన్షన్లు ఇస్తున్నారోచ్ ..!
గత ప్రభుత్వ హయాంలో అనేక మంది అర్హులు పింఛన్ పొందలేకపోయారు. పలు ఆరోపణలు వెలుగుచూశాయి. దివ్యాంగుల కోటాలో బోగస్ సర్టిఫికెట్లు ఉపయోగించి దుర్వినియోగం జరిగినట్లు వెలుగు చూసిన నేపథ్యంలో, ఈసారి ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రత్యేక వైద్య బృందాల ద్వారా ధృవీకరణ ప్రక్రియ చేపట్టి, నిజమైన అర్హులను గుర్తించనుంది. ఇలా డేటా ఆధారిత విధానంతో పింఛన్ల పంపిణీని నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది.
ఈ కొత్త పింఛన్ల విధానం అమలులో భాగంగా మేలో పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. జూన్ నుంచి పంపిణీ ప్రారంభమయ్యే అవకాశముంది. జులైలో కొత్త దరఖాస్తులు స్వీకరించి, ఆగస్టు నుంచి ఎంపికైన వారికి పింఛన్లు ఇవ్వనున్నారు. ప్రభుత్వం పాలసీ ప్రకటనను త్వరలోనే అధికారికంగా వెలువరించనుంది. ఇది పింఛన్ కోసం నిరీక్షణలో ఉన్న లక్షలాది ప్రజలకు ఊరట కలిగించే వార్తగా నిలుస్తోంది.
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని రాష్ట్ర ఐటీ, విద్య శాఖ…
Cricketer : ప్రసిద్ధ కొరియోగ్రాఫర్, సోషల్ మీడియా ఇన్ఫ్ల్యూయెన్సర్ అయిన ధనశ్రీ వర్మతో భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ విడాకులు…
Kingdom Movie Collections : విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ జూలై 31న భారీ అంచనాల మధ్య…
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన…
Apple Peels : ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఒక యాపిల్ తినాలి అని వైద్యులు సలహా ఇస్తూనే ఉంటారు.…
Varalakshmi Kataksham : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రావణమాసానికి ఎంతో ప్రత్యేకత ఉందని చెబుతున్నారు పండితులు. ఇంకా,లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తికి…
Goji Berries : స్ట్రాబెర్రీ,చెర్రీ పండ్లు గురించి చాలామందికి తెలుసు.కానీ గోజీ బెర్రీల గురించి ఎప్పుడైనా విన్నారా... దీని గురించి…
Rakhi Festival : ఈ ఏడాది ఆగస్టు 9వ తేదీన రాఖీ పండుగ వచ్చినది. సోదరీ సోదరీమణులు ఎంతో ఆత్మీయంగా…
This website uses cookies.