B.R.Ambedkar Statue : సామాజిక న్యాయం మహా శిల్పం ఆవిష్కరించిన సీఎం జగన్..!

B.R.Ambedkar Statue : జగన్ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలోని బెజవాడ స్వరాజ్యం మైదానంలో నిర్మిస్తున్న భారతరత్న బాబా సాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్మృతివనం ఈరోజు ప్రారంభించారు. చరిత్రలో ఎక్కడ లేని విధంగా సామాజిక న్యాయం మహా శిల్పం ముస్తాబు చేశారు. ఇక ఈరోజు ఆ విగ్రహాన్ని ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. అయితే గతంలోనే అంబేద్కర్ స్మృతివనాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ పనులు పూర్తి కాకపోవడం వలన వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు అన్ని పనులు పూర్తిచేసుకుని ఈరోజు వైయస్ జగన్ ప్రారంభించారు. అత్యంత సుందరంగా తీర్చిదిద్దున ఈ ప్రాంగణం ప్రపంచ స్థాయి పర్యటకులను సైతం ఆకర్షించేలా ఉంది. అంతేకాక భారతదేశంలోనే అతిపెద్ద విగ్రహం కావడంతో మరింత ఆకర్షణగా నిలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ విగ్రహం ఎత్తు దాదాపు 206 అడుగులు ఉండగా దానిలో 81 అడుగులు బేస్ దానిపై 125 అడుగుల విగ్రహాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. అలాగే రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఆకర్షించేందుకు లైటింగ్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేలా తీర్చిదిద్దారు…

ఇక ఈ ప్రాజెక్టును సీఎం జగన్ స్వయంగా పర్యవేక్షించి అత్యంత అద్భుతంగా రూపొందించడానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం. అంతేకాక ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుండి జగన్ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, సమీక్షలు చేస్తూ కీలక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే దీన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి చేయడం జరిగింది. అయితే ఈరోజు అంబేద్కర్ స్మృతి వనం ఆవిష్కరించగా రేపటినుండి సామాన్య ప్రజలకు కూడా వనం లోకి ప్రవేశం కల్పించనున్నట్లు సమాచారం. ఇక ఈ స్మృతి వనం 18.18 ఎకరాలలో 404.35 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించడం జరిగింది. ఇక ఈ వనంలో అందమైన గార్డెన్ , వాటర్ బాడీస్ , మ్యూజికల్ ఫౌంటెన్లు , చిన్నపిల్లలు ఆడుకోవడానికి వసతి , అలాగే వాకింగ్ చేసుకోవడానికి వీలుగా తీర్చిదిద్దారు. అదేవిధంగా వాహనాలు పార్కింగ్ కు ఎలాంటి ఇబ్బందు లేకుండా తగిన సౌకర్యాలులు కల్పించారు. ఇలా అంబేద్కర్ స్మృతి వనంలో ఎన్నో అంగులు ఉన్నాయి. అలాగే దీనిలో గ్రౌండ్ , ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లు కూడా ఉన్నాయి.. ఇక గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు హాల్స్ ఉండగా దీనిలో ఒక సినిమా హాల్, మిగిలిన మూడు అంబేద్కర్ చరిత్ర తెలిపేలా డిజిటల్ మ్యూజియాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక ఫర్స్ట్ ఫ్లోర్లో 2250 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గదులు ఏర్పాటు చేశారు. దీనిలో రెండు హాల్స్ లో మ్యూజియం ఒక హాల్లో లైబ్రరీ ఉన్నట్లు సమాచారం. ఇక సెకండ్ ఫ్లోర్లో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నాలుగు హాల్స్ ఉన్నాయి. దీనిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఢిల్లీ నుంచి వచ్చిన డిజైనర్లు చాలా సుందరంగా దీనిని తీర్చిదిద్దారు. ఇక ఇది ప్రపంచంలోనే అంబేద్కర్ జీవిత చరిత్ర తెలిపే అతిపెద్ద మ్యూజియంగా పేరు పొందుతుంది. అలాగే దీనిలో మినీ థియేటర్లు ,ఫుట్ కోర్ట్స్ ,కన్వెన్షన్ సెంటర్లు కూడా ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్ 6,340 చదరపు అడుగులు విస్తీర్ణంలో 2000 మంది సింపుల్ గా కూర్చునే విధంగా నిర్మించారు. అదేవిధంగా ఫుడ్ కోర్టు ఎనిమిది వేలు చదరపు అడుగులు విస్తీర్ణంలో నిర్మించడం జరిగింది. అదేవిధంగా బిల్డింగ్ చుట్టూ నీటి ఫౌంటైన్స్, మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు. ఇక ఇవన్నీ అడ్వాన్సుడ్ టెక్నాలజీతో కూడి ఉండడంతో అందరినీ ఆకర్షిస్తున్నాయి.

Recent Posts

Bonus | సింగరేణి కార్మికులకు భారీ శుభవార్త .. దీపావళి బోనస్ కూడా ప్రకటించిన కేంద్రం

Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…

11 minutes ago

Vijaywada | 5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు5 రోజుల్లో భారీ ఆదాయం.. భ‌క్తులంద‌రికీ ఉచిత ద‌ర్శ‌నాలు

Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…

3 hours ago

AP Free Bus Scheme | ఏసీ బ‌స్సుల్లోను ఫ్రీగా ప్ర‌యాణించే ఛాన్స్.. కీలక ప్రకటన చేసిన ఆర్టీసీ ఎండీ

AP Free Bus Scheme |  ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…

4 hours ago

Telangana IPS Transfers | తెలంగాణలో భారీ ఐపీఎస్ బదిలీలు .. ప్రభుత్వ పరిపాలనలో కొత్త అడుగులు…

Telangana IPS Transfers | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఐపీఎస్‌ అధికారుల బదిలీలు చేపట్టింది. పోలీసు వ్యవస్థతో…

6 hours ago

Allu Family | అల్లు వారింట పెళ్లి సంద‌డి.. శిరీష్ పెళ్లి చేసుకోబోయే యువ‌తి ఎవ‌రంటే..!

Allu Family | మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…

7 hours ago

Eye Care Tips | స్వీట్స్ ఎక్కువ తింటున్నారా.. కంటి చూపు పోయే ప్రమాదం..!

Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…

8 hours ago

Ramen noodles | రామెన్ నూడుల్స్ అధిక వినియోగం..మరణ ప్రమాదం 1.5 రెట్లు పెరుగుదల

Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…

9 hours ago

Lungs | ప్రజలకు హెచ్చరిక.. ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ఏ మాత్రం నిర్ల‌క్ష్యం చేయోద్దు..!

Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…

10 hours ago