Dwcra Women : డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం తీపికబురు..!

 Authored By ramu | The Telugu News | Updated on :11 June 2025,3:50 pm

ప్రధానాంశాలు:

  •   డ్వాక్రామహిళల పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్న చంద్రబాబు సర్కార్

  •  డ్వాక్రామహిళల కుటుంబంలో సంతోషం నింపిన ఏపీ ప్రభుత్వం

  •  Dwcra Women : డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం తీపికబురు..!

Dwcra Women : ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా సంఘాల మహిళలకు కూటమి ప్రభుత్వం మరో తీపికబురు తెలిపింది. డ్వాక్రా సంఘాలలో సభ్యులుగా ఉన్న మహిళల పిల్లల విద్య కోసం నూతన పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ఎన్టీఆర్ విద్యా సంకల్పం’ పేరిట ఈ స్కీం తీసుకొస్తున్న ప్రభుత్వం, గ్రామీణ మహిళల పిల్లలకు విద్యార్థి రుణాల రూపంలో ఆర్థిక భరోసా కల్పించనుంది. ఈ పథకం ద్వారా విద్యార్థులకు కేవలం నాలుగు శాతం వడ్డీ (ప్రతి రూపాయికి 35 పైసలు వడ్డీ)తో రూ.10 వేలు నుంచి లక్ష రూపాయల వరకు రుణాన్ని మంజూరు చేయనుంది.

Dwcra Women : డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం తీపికబురు..!

Dwcra Women : డ్వాక్రామహిళలకు కూటమి ప్రభుత్వం తీపికబురు..!

Dwcra Women : డ్వాక్రామహిళల పిల్లలకు ఎడ్యుకేషన్ లోన్..ఇందుకోసం చేయాల్సిన పనులు

ఈ పథకం లక్ష్యం విద్యను కొనసాగించడంలో ఆర్థికంగా వెనుకబడే కుటుంబాలకు తోడ్పాటు అందించడం. విద్యార్థులు 1వ తరగతి నుంచి పీజీ వరకు ఏ స్థాయిలో చదువుతున్నా, ప్రభుత్వ లేదా ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివినా, ఈ స్కీం వర్తిస్తుంది. రుణాన్ని పిల్లల యూనిఫార్మ్, పుస్తకాలు, ఫీజులు, సైకిల్ కొనుగోలు వంటి విద్యా సంబంధిత అవసరాలకు మాత్రమే ఉపయోగించాలి. ఖర్చులకు సంబంధించిన రశీదులు అధికారులకు సమర్పించాలి. రుణాన్ని కనీసం 24 నెలల నుంచి గరిష్టంగా 36 నెలల లోపు వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) నోడల్ ఏజెన్సీగా అమలు చేస్తోంది. స్త్రీనిధి కార్యక్రమానికి అనుసంధానంగా ఈ పథకం కొనసాగనుంది. లబ్ధిదారులు ఈ స్కీం ద్వారా పూర్తిగా ప్రయోజనం పొందాలంటే, వారు తప్పనిసరిగా డ్వాక్రా సంఘ సభ్యులుగా ఉండాలి. అవసరమైన సమాచారం కోసం SERP లేదా స్త్రీనిధి అధికారులను సంప్రదించాలి. ఈ పథకం ద్వారా పేదవారి పిల్లలు విద్యలో ముందుకెళ్లే అవకాశం పొందుతారని, వారి భవిష్యత్‌కి ఇది బలమైన మద్దతుగా నిలవనుందని ప్రభుత్వం ఆశిస్తోంది.

Tags :

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి