ఇది మామూలు షాకింగ్ న్యూస్ కాదు.. 100 కోట్ల ఆస్తులు అమ్ముకొని ఇంకా అప్పుల్లోనే ఏపీ మాజీ మంత్రి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

ఇది మామూలు షాకింగ్ న్యూస్ కాదు.. 100 కోట్ల ఆస్తులు అమ్ముకొని ఇంకా అప్పుల్లోనే ఏపీ మాజీ మంత్రి

ఏపీ మాజీ మంత్రి అనగానే ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు అనీల్ కుమార్ యాదవ్. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఫైర్ బ్రాండ్ అనే చెప్పుకోవాలి. ప్రతిపక్షాల మీద తనదైన శైలిలో రెచ్చిపోయేవారు. కానీ.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన మంత్రి పదవి పోయి కేవలం ఎమ్మెల్యేగానే మిగిలిపోవాల్సి వచ్చింది. సరే.. అదంతా పక్కన పెడితే అనీల్ కుమార్ యాదవ్ మంత్రి పదవే కాదు.. రూ.100 కోట్ల ఆస్తి కూడా పోయిందట. వంద కోట్ల ఆస్తి పోయినా […]

 Authored By kranthi | The Telugu News | Updated on :7 July 2023,2:00 pm

ఏపీ మాజీ మంత్రి అనగానే ఎవరు అని అనుకుంటున్నారా? ఇంకెవరు అనీల్ కుమార్ యాదవ్. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఫైర్ బ్రాండ్ అనే చెప్పుకోవాలి. ప్రతిపక్షాల మీద తనదైన శైలిలో రెచ్చిపోయేవారు. కానీ.. మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయన మంత్రి పదవి పోయి కేవలం ఎమ్మెల్యేగానే మిగిలిపోవాల్సి వచ్చింది. సరే.. అదంతా పక్కన పెడితే అనీల్ కుమార్ యాదవ్ మంత్రి పదవే కాదు.. రూ.100 కోట్ల ఆస్తి కూడా పోయిందట. వంద కోట్ల ఆస్తి పోయినా కూడా ఇంకా అప్పులే మిగిలాయట. ఈ వివరాలన్నీ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి.

అసలు ముచ్చట ఏంటంటే.. నెల్లూరులో ప్రస్తుతం టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగుతోంది కదా. ఈ పాదయాత్రలో నారా లోకేష్.. అనీల్ కుమార్ యాదవ్ మీద తెగ విమర్శలు చేస్తున్నారు. మామూలుగా కాదు.. మూడేళ్లు మంత్రి పదవిలో ఉండి.. వెయ్యి కోట్లు వెనకేసుకున్నాడు అంటూ ఇష్టం ఉన్నట్టుగా ఆరోపణలు చేశారు నారా లోకేష్. దీంతో అనీల్ కుమార్ కు కోపం వచ్చినట్టుంది వెంటనే ప్రెస్ మీట్ పెట్టేశారు.

Ysrcp

Ysrcp

 : నా సొంత భూమినే అమ్ముకున్నా

నేను మంత్రి అయ్యాక రూ.2.25 కోట్ల వాల్యూ ఉన్న నా సొంత భూమినే అమ్ముకున్నా. ఇస్కాన్ సిటీలో 18 ఎకరాలు ఉండేది. అది ఇప్పుడు 3.98 ఎకరాలు అయింది. నా భార్యకు హైదరాబాద్ లో పసుపు కుంకుమ కింద వచ్చిన 8 సెంట్ల స్థలం తప్పితే నాకు ఇంకేమీ లేదని అనీల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అయితే.. 2.25 కోట్ల రిజిస్ట్రేషన్ వాల్యూ ఉన్న ఆ సైట్ విలువ రూ.100 కోట్లు అట. దాన్ని అనీల్ కుమార్ యాదవ్ ఎందుకు అమ్మేసుకున్నారు పాపం అంటూ ఏపీ ప్రజలు తెగ జాలి చూపిస్తున్నారు. ప్రస్తుతం అనీల్ ప్రెస్ మీట్ పైనే ఏపీలో జోరుగా చర్చ నడుస్తోంది.

Tags :

    kranthi

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది